Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ ‘విక్రమ్’ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆరు చక్రాల రోబోటిక్ వాహనం ప్రజ్ఞాన్ రోవర్ తన మిషన్ను నిర్వహిస్తుంది. చంద్రుడిపై తిరుగుతూ డేటాను విక్రమ్ ల్యాండర్కు చేరవేస్తుంది. ఆ ల్యాండర్ బెంగళూరులోని రీసెర్చ్ సెంటర్కు ఆ సమాచారాన్ని చేరవేస్తుందని తెలుస్తోంది. నిర్భయమైన అన్వేషకుడిలా ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపై దిగి, చెరగని గుర్తును వదిలివేస్తాడు. ఈ ముద్ర ఇస్రో లోగో, భారతదేశ చిహ్నంతో అలంకరించబడిన పాదముద్రలుగా ఉంటుంది. చంద్రుని అన్వేషణలో భారతదేశ ప్రవేశానికి చిహ్నం, ఇది శాశ్వతంగా ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, ఉత్తేజకరమైన శాస్త్రీయ ఆవిష్కరణలు, అపూర్వమైన విజయాలను వాగ్దానం చేస్తూ ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం ప్రారంభమవుతుంది.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
విశేషమేమిటంటే భారతదేశానికి ఆగస్టు 23 బుధవారం ఎప్పటికీ మరచిపోలేని చారిత్రాత్మక దినంగా మారింది. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టిస్తూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. చంద్రుడి కాలమానం ప్రకారం ఒక రోజు మాత్రమే ( మన లెక్కలో 14 రోజులు) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరుసటి రోజు సూర్యోదయం తరువాత (14 రోజుల తర్వాత) రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇస్రోకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ట్విటర్ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ నెల్సన్ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రయాన్ 3 విజయం పట్ల బ్రిటన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అభినందనలు తెలిపింది.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!