Minister Roja: బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంత్రి ఆర్.కె. రోజా మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణీ మాట్లాడిన మాటలకు ఆమే కౌంటరిచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందని మంత్రి రోజా విమర్శించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా అని ప్రశ్నించారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని ఎద్దేవా చేశారు. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడన్నారు.
Read Also: Telangana : 97 ఏళ్ల వయస్సులో కులవృత్తిని వదలని వృద్ధుడు.. హ్యాట్సాఫ్..
Also Read
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
మీ మామ ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా అని బ్రాహ్మణీని ప్రశ్నించారు మంత్రి రోజా. మీ తాత ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు ఏంటో అర్థం అవుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలు లేవు అని బ్రాహ్మణీ అంటోందని.. ఒకసారి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఆధారాలు చూపిస్తారని పేర్కొన్నారు. బ్రాహ్మణికి చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనుకుంటుందా? లేక దేశానికి ప్రధానిగా చేశాడని అనుకుంటోందా అని దుయ్యబట్టారు.
Read Also: Husbands Legal Rights: భార్యా బాధితుల్లారా మేల్కోండి.. మీకున్న చట్టపర హక్కుల గురించి తెలుసుకోండి?
మరోవైపు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చి కళ్యాణ్ కు ప్రపంచంలో ఉన్న అందరూ పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడని.. జగన్ రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్ళు అయిందని తెలిపారు. రెండు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఒకసారి ప్రతిపక్ష నేతగా, 151 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి రోజా అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ బతుకు ఎంత అని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయినా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేపోయాడని విమర్శించారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ స్థాయికి మించి మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
- Tags
- brahmani
- counter
- RK Roja
- tdp
- telugu news
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!