Rohit Sharma: భారత జట్టు ఇంకా ఖరారు కాలేదు.. 8-10 మంది ఆటగాళ్లు మదిలో ఉన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ముందు అఫ్గానిస్థాన్తో ఆఖరి పొట్టి సిరీస్ను భారత్ ఆడేసింది. ఇక జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే పొట్టి కప్పులోనే నేరుగా భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా భారత జట్టు ఖరారు కాలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ పొట్టి టోర్నీలో ఆడే 8-10 ఆటగాళ్లెవరో తమ మదిలో ఉన్నారని చెప్పాడు. ప్రధాన జట్టును ఎంపిక చేసినప్పుడు బాగా ఆడిన కొందరిని తప్పించక తప్పదు అని రోహిత్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ 14 నెలల విరామం అనంతరం అఫ్గాన్ సిరీస్తో టీ20ల్లో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
‘వన్డే ప్రపంచకప్ 2023కు ముందు చాలా మంది కుర్రాళ్లకు నిరూపించుకునే అవకాశం ఇచ్చాం. టీ20 ప్రపంచకప్ 2024 కోసం కూడా ఆటగాళ్లను పరిశీలించి చూస్తున్నాం. కొందరు బాగా ఆడారు. కానీ ప్రధాన జట్టును ఎంపిక చేసినప్పుడు కొందరిని తప్పించక తప్పదు. అది వారికి నిరాశ కలిగిస్తుందని నాకు తెలుసు. జట్టులో ఓ స్పష్టత తేవడం మా కర్తవ్యం. 25-30 మంది ఆటగాళ్లలో మేం ప్రపంచకప్ జట్టును ఎంచుకోవాలి. ఇప్పటివరకు మేము భారత జట్టును ఖరారు చేయలేదు. కానీ టీ20 ప్రపంచకప్లో ఆడబోయే 8-10 మంది ఆటగాళ్లు మా మదిలో ఉన్నారు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.. బరిలోకి దిగేది ఎప్పుడంటే?
‘వెస్టిండీస్లో పిచ్లు మందకొడిగా ఉంటాయి. యూస్ పిచ్లు బిన్నంగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగా భారత జట్టును ఎంపిక చేయాలి. నేను, కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుకు ఒక రూపు తేవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే అందరికీ అవకాశం రాకపోవచ్చు. అందరినీ సంతోషపెట్టలేమని కెప్టెన్సీలో నేర్చుకున్నా. ఎప్పుడూ కూడా జట్టు అవసరాలపైనే దృష్టి పెట్టాలి. ఏడాదికి పైగా నేను టీ20 క్రికెట్ ఆడకున్నా.. మ్యాచ్లు చూస్తూనే ఉన్నా. కొన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది. రాహుల్ భాయ్తో కొన్ని ఆలోచనలు పంచుకున్నా. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. బౌలర్లను భిన్న రకాలుగా ప్రయత్నించాలని భావించాం. పవర్ప్లేలో బౌలింగ్ చేయడం ఇబ్బందిగా భావించే బౌలర్ను అక్కడే (పవర్ప్లే) బౌలింగ్ చేయించాం. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఇబ్బంది పడేవారిని ఆఖర్లో బౌలింగ్ చేయించాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!