T20 World Cup 2024: ఎంఎస్ ధోనీని ఒప్పించడం కష్టమే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik impressed me Says Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్లపై భారత సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారని, అద్భుతంగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం కష్టమే అని రోహిత్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం డీకేను ఒప్పించడం మాత్రం సులువే అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. నేడు ఐపీఎల్లో పంజాబ్తో ముంబై తలపడనుంది. ఈ నేపథ్యంలో మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లతో కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్కాస్ట్లో రోహిత్ పాల్గొన్నాడు.
‘నేను ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్ల ఆటకు ఫిదా అయ్యా. ముఖ్యంగా డీకే ఆట నన్ను ఆకట్టుకుంది. గత రెండు మ్యాచ్లలో అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. కొన్ని మంచి షాట్స్ ఆడాడు. డీకే పరుగుల దాహంతో ఉన్నాడు. ధోనీ కొట్టిన మూడు సిక్సులు సూపర్ అనే చెప్పాలి. 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మహీ బ్యాటింగ్ మా జట్టుపై భారీ ప్రభావం చూపింది. మేం ధోనీ కొట్టిన 20 పరుగుల తేడాతోనే ఓడిపోయాం’ అని రోహిత్ శర్మ పోడ్కాస్ట్లో చెప్పాడు.
Also Read
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
Also Read: Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
‘ఎంఎస్ ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం చాలా కష్టమే. ఐపీఎల్ 2024లో ఆడటం వల్ల మహీ భాయ్ అలసిపోతాడు. అంతేకాదు మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు వెస్టిండీస్కు రాకపోవచ్చు. కానీ అమెరికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్ఫ్ ఆడేందుకు యూస్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఇక వికెట్ కీపర్ స్థానం కోసం దినేష్ కార్తీక్ను ఒప్పించడం మాత్రం చాలా సులభం అని నేను ఊహిస్తున్నా’ అని హిట్మ్యాన్ అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే.. డీకేకు టీ20 ప్రపంచకప్లో చోటు ఖాయంగానే కనబడుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో భారత జట్టు మెంటార్గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!