T20 World Cup 2024: ఎంఎస్ ధోనీని ఒప్పించడం కష్టమే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik impressed me Says Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్లపై భారత సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారని, అద్భుతంగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం కష్టమే అని రోహిత్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం డీకేను ఒప్పించడం మాత్రం సులువే అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. నేడు ఐపీఎల్లో పంజాబ్తో ముంబై తలపడనుంది. ఈ నేపథ్యంలో మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లతో కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్కాస్ట్లో రోహిత్ పాల్గొన్నాడు.
‘నేను ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్ల ఆటకు ఫిదా అయ్యా. ముఖ్యంగా డీకే ఆట నన్ను ఆకట్టుకుంది. గత రెండు మ్యాచ్లలో అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. కొన్ని మంచి షాట్స్ ఆడాడు. డీకే పరుగుల దాహంతో ఉన్నాడు. ధోనీ కొట్టిన మూడు సిక్సులు సూపర్ అనే చెప్పాలి. 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మహీ బ్యాటింగ్ మా జట్టుపై భారీ ప్రభావం చూపింది. మేం ధోనీ కొట్టిన 20 పరుగుల తేడాతోనే ఓడిపోయాం’ అని రోహిత్ శర్మ పోడ్కాస్ట్లో చెప్పాడు.
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
Also Read: Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
‘ఎంఎస్ ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం చాలా కష్టమే. ఐపీఎల్ 2024లో ఆడటం వల్ల మహీ భాయ్ అలసిపోతాడు. అంతేకాదు మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు వెస్టిండీస్కు రాకపోవచ్చు. కానీ అమెరికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్ఫ్ ఆడేందుకు యూస్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఇక వికెట్ కీపర్ స్థానం కోసం దినేష్ కార్తీక్ను ఒప్పించడం మాత్రం చాలా సులభం అని నేను ఊహిస్తున్నా’ అని హిట్మ్యాన్ అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే.. డీకేకు టీ20 ప్రపంచకప్లో చోటు ఖాయంగానే కనబడుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో భారత జట్టు మెంటార్గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!