Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్లు ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్కి సంబంధించి ఎవరినీ కలవలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలే అని అన్నాడు. భారత జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేస్తామని, అప్పటివరకు వచ్చే వార్తలను ఎవరూ నమ్మోద్దని రోహిత్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లు కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్కి సంబంధించి నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దుబాయ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా రాహుల్ భాయ్ తన కుమారుడి కోసం ముంబై వచ్చి ఉంటాడు. మేం ముగ్గురం ఇప్పటివరకు కలవలేదు. ఇక జట్టును ఎలా నిర్ణయిస్తాం’ అని ప్రశ్నించాడు.
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్మన్ గిల్.. వీడియో వైరల్!
‘నేను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదంటే బీసీసీఐ స్వయంగా కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడితేనే అవి నిజాలు. లేదంటే అన్ని ఫేక్. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దు’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ.
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..