Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్లు ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్కి సంబంధించి ఎవరినీ కలవలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలే అని అన్నాడు. భారత జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేస్తామని, అప్పటివరకు వచ్చే వార్తలను ఎవరూ నమ్మోద్దని రోహిత్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లు కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్కి సంబంధించి నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దుబాయ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా రాహుల్ భాయ్ తన కుమారుడి కోసం ముంబై వచ్చి ఉంటాడు. మేం ముగ్గురం ఇప్పటివరకు కలవలేదు. ఇక జట్టును ఎలా నిర్ణయిస్తాం’ అని ప్రశ్నించాడు.
Also Read
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్మన్ గిల్.. వీడియో వైరల్!
‘నేను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదంటే బీసీసీఐ స్వయంగా కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడితేనే అవి నిజాలు. లేదంటే అన్ని ఫేక్. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దు’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!