Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్లు ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్కి సంబంధించి ఎవరినీ కలవలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలే అని అన్నాడు. భారత జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేస్తామని, అప్పటివరకు వచ్చే వార్తలను ఎవరూ నమ్మోద్దని రోహిత్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లు కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్కి సంబంధించి నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దుబాయ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా రాహుల్ భాయ్ తన కుమారుడి కోసం ముంబై వచ్చి ఉంటాడు. మేం ముగ్గురం ఇప్పటివరకు కలవలేదు. ఇక జట్టును ఎలా నిర్ణయిస్తాం’ అని ప్రశ్నించాడు.
Also Read
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్మన్ గిల్.. వీడియో వైరల్!
‘నేను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదంటే బీసీసీఐ స్వయంగా కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడితేనే అవి నిజాలు. లేదంటే అన్ని ఫేక్. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దు’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!