Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్లు ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్కి సంబంధించి ఎవరినీ కలవలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలే అని అన్నాడు. భారత జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేస్తామని, అప్పటివరకు వచ్చే వార్తలను ఎవరూ నమ్మోద్దని రోహిత్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్లు కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్కి సంబంధించి నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దుబాయ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా రాహుల్ భాయ్ తన కుమారుడి కోసం ముంబై వచ్చి ఉంటాడు. మేం ముగ్గురం ఇప్పటివరకు కలవలేదు. ఇక జట్టును ఎలా నిర్ణయిస్తాం’ అని ప్రశ్నించాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్మన్ గిల్.. వీడియో వైరల్!
‘నేను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదంటే బీసీసీఐ స్వయంగా కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడితేనే అవి నిజాలు. లేదంటే అన్ని ఫేక్. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దు’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..