Kohli-Rohit: విరాట్ కోహ్లీతో పోస్టర్.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్!
- న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్ ఆరంభం
- నవంబర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- భారత అభిమానులకు ఆగ్రహం
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. నవంబర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. గతంలో రెండుసార్లు టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంతో.. ఈసారి ఆసీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్ క్రికెట్’ విశ్లేషణలతో కూడిన ఓ వీడియోను, పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు.. భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఇంగ్లండ్కు చెందిన బార్మీ ఆర్మీ తన పోస్టులో విరాట్ కోహ్లీని హైలైట్ చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం కింగ్ కోహ్లీ వస్తున్నాడంటూ పేర్కొంది. కోహ్లీని హైలైట్ చేస్తూ ఉండటంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోహిత్ కెప్టెన్గా ఉన్నప్పుడు అతడిని పక్కనపెట్టడం సరైంది కాదంటూ ఫాన్స్ కామెంట్లు వచ్చాయి. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అధికారిక ఫ్యాన్ గ్రూప్ అయిన బార్మీ ఆర్మీ ఇలాంటి పోస్టులను గతంలోనూ చాలాసార్లే పెట్టింది.
Also Read
Also Read: Akhanda 2: మాస్ కాంబోలో నాలుగో చిత్రం.. ఈసారి ‘అఖండ’ తాండవమే!
ఆస్ట్రేలియా గడ్డపై గత రెండుసార్లు విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే భారత్ సిరీస్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. కానీ ఆసీస్ మీడియా మాత్రం రోహిత్ను కాకుండా ఇంకా కోహ్లీనే సారథిగా భావిస్తున్నట్లుగా వీడియోకు హెడ్డింగ్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఫాక్స్ క్రికెట్ పెట్టిన వీడియో థంబ్నైల్లో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టును పెట్టడం గమనార్హం. సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. రాబోయే సిరీస్కు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడని, కోహ్లీతో థంబ్నైల్ పెట్టడం బాగాలేదని హిట్మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో