Rohit Sharma: ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండండి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్ ప్రయత్నాలు
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
కానీ, భారత భద్రతా దళాలు ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత భారత్ మళ్లీ పాక్పై సమాధానాత్మక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలావరకు వీడియోలు నకిలీవని AI సాంకేతికత ద్వారా తయారైనవని ఫ్యాక్ట్ చెకర్లు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. తెలుగు జవాన్ వీరమరణం..
With every passing moment, with every decision taken I feel extremely proud of our Indian Army, Indian Airforce & Indian Navy. Our warriors are standing tall for our nation’s pride. It’s important for every Indian to be responsible and refrain from spreading or believing any fake…
— Rohit Sharma (@ImRo45) May 9, 2025
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారత సాయుధ దళాలపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి తన మద్దతును తెలియజేశారు. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మన భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం పట్ల నాకు గర్వంగా ఉంటుంది. మన యోధులు దేశ గౌరవాన్ని కాపాడేందుకు నిలబడి ఉన్నారని రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాక, భారత ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ, ఫేక్ న్యూస్ను నమ్మకూడదనీ, దానిని పంచుకోకూడదనీ తెలిపారు. అలాగే ప్రతీ భారతీయుడు బాధ్యతగా ఉండాలి. ఏదైనా అప్రమత్తత లేకుండా నమ్మే ఫేక్ న్యూస్ వల్ల అనవసర భయం, అపోహలు వ్యాపిస్తాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ తన ఖాతాలో తెలిపాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్ అవుతున్నట్లు తెలిపిన విషయం తెలిపిందే.
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!