Rohit Sharma: ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండండి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి..!
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్ ప్రయత్నాలు
Also Read
కానీ, భారత భద్రతా దళాలు ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత భారత్ మళ్లీ పాక్పై సమాధానాత్మక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలావరకు వీడియోలు నకిలీవని AI సాంకేతికత ద్వారా తయారైనవని ఫ్యాక్ట్ చెకర్లు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. తెలుగు జవాన్ వీరమరణం..
With every passing moment, with every decision taken I feel extremely proud of our Indian Army, Indian Airforce & Indian Navy. Our warriors are standing tall for our nation’s pride. It’s important for every Indian to be responsible and refrain from spreading or believing any fake…
— Rohit Sharma (@ImRo45) May 9, 2025
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారత సాయుధ దళాలపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి తన మద్దతును తెలియజేశారు. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మన భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం పట్ల నాకు గర్వంగా ఉంటుంది. మన యోధులు దేశ గౌరవాన్ని కాపాడేందుకు నిలబడి ఉన్నారని రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాక, భారత ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ, ఫేక్ న్యూస్ను నమ్మకూడదనీ, దానిని పంచుకోకూడదనీ తెలిపారు. అలాగే ప్రతీ భారతీయుడు బాధ్యతగా ఉండాలి. ఏదైనా అప్రమత్తత లేకుండా నమ్మే ఫేక్ న్యూస్ వల్ల అనవసర భయం, అపోహలు వ్యాపిస్తాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ తన ఖాతాలో తెలిపాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్ అవుతున్నట్లు తెలిపిన విషయం తెలిపిందే.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!