Road Accident: రోడ్ టెర్రర్.. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- గ్వాలియర్లో ట్రక్కు-ఆటో ఢీ
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి
- ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మోరెనా హైవేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. కుటుంబ సమేతంగా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: BSF: పాకిస్థాన్ ‘డ్రోన్’ కుట్ర.. 6 నెలల్లో 126 డ్రోన్లు కూల్చేసిన బీఎస్ఎఫ్
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
ఈ ప్రమాదంపై ఓల్డ్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర చౌహాన్ మాట్లాడుతూ.. మోరెనా హైవేపై ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని తెలిపారు. మృతుల కుటుంబం మొరెనాలోని బాన్మోర్లో నివాసముంటున్నదని.. భింద్ జిల్లాలో జరిగిన వివాహ వేడుక నుండి కుటుంబం మొత్తం తిరిగి వస్తోండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
Read Also: Delhi: ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ.. గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు
ప్రమాదం జరిగిన వెంటనే.. ఘటనాస్థలి నుంచి ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని ధర్మేంద్ర చౌహాన్ పేర్కొన్నారు. దీంతో.. డ్రైవర్ పై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను 52 ఏళ్ల నరేష్ వాల్మీకి, అతని భార్య ఉష (45), అతని కుమారుడు రాహుల్ (25), మేనకోడలు అంకిత (16)గా గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!