Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.
Maneka Gandhi: వరుణ్గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తల్లి ఏమన్నారంటే..!
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈ క్రమంలో.. డ్రైవర్ను పట్టుకునేందుకు స్థానికులు ట్రక్కు వైపు పరుగులు తీయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ గందరగోళంలో.. త్రీవీలర్ను ఢీకొట్టాడు.. ఆ తర్వాత కొంతమంది పాదచారులను ఢీకొన్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్వారి మోడ్లో నివసించే కొందరు వ్యక్తులు అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని వగర్దంగా గ్రామంలో ఒక వివాహ వేడుక నుండి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. భమురియా గ్రామ సమీపంలోని మలుపు వద్ద ట్రక్కు ఆటోను ఢీకొట్టిందన్నారు. దీంతో ఆటో డ్రైవర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతుల్లో శ్యామపాడ్ మండల్ (74), భాగ్యవతి మండల్ (63), మృదుల్ మండల్ (45) ఉన్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయని.. అతడిని నితుదియ బ్లాక్ ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.
TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం ఐదుగురు చనిపోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామ సమీపంలో బలవంతంగా ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!