JC Prabhakar Reddy: టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది!
- ప్రమాదాలను వివరిస్తూ జేసీ ఫ్లెక్సీ
- రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర అంటూ ఫ్లెక్సీ
- టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దని రోజాను జేసీ హెచ్చరించారు.
‘వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేయడానికి బయలు దేరారు. ఆనం గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఆనం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు. రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలి. తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని వెంట తీసుకెళ్లేది. టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి. చెక్ బౌన్స్ కేసులు రోజాపై ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చింది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
- Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
‘మేం వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డాం. తాడిపత్రిలోనే కార్యకర్తలప్తె 890 కేసులు ఉన్నాయి. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీ మంచితనం అందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు మాత్రం వారిని వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఆయనకు వైసీపీలోనే శత్రువులు ఉన్నారు. తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. తిరుపతి ఘటనలో పూర్తిస్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!