JC Prabhakar Reddy: టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది!
- ప్రమాదాలను వివరిస్తూ జేసీ ఫ్లెక్సీ
- రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర అంటూ ఫ్లెక్సీ
- టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దని రోజాను జేసీ హెచ్చరించారు.
‘వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేయడానికి బయలు దేరారు. ఆనం గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఆనం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు. రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలి. తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని వెంట తీసుకెళ్లేది. టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి. చెక్ బౌన్స్ కేసులు రోజాపై ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చింది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
‘మేం వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డాం. తాడిపత్రిలోనే కార్యకర్తలప్తె 890 కేసులు ఉన్నాయి. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీ మంచితనం అందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు మాత్రం వారిని వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఆయనకు వైసీపీలోనే శత్రువులు ఉన్నారు. తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. తిరుపతి ఘటనలో పూర్తిస్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!