JC Prabhakar Reddy: టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది!
- ప్రమాదాలను వివరిస్తూ జేసీ ఫ్లెక్సీ
- రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర అంటూ ఫ్లెక్సీ
- టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దని రోజాను జేసీ హెచ్చరించారు.
‘వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేయడానికి బయలు దేరారు. ఆనం గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఆనం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు. రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలి. తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని వెంట తీసుకెళ్లేది. టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి. చెక్ బౌన్స్ కేసులు రోజాపై ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చింది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
‘మేం వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డాం. తాడిపత్రిలోనే కార్యకర్తలప్తె 890 కేసులు ఉన్నాయి. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీ మంచితనం అందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు మాత్రం వారిని వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఆయనకు వైసీపీలోనే శత్రువులు ఉన్నారు. తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. తిరుపతి ఘటనలో పూర్తిస్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!