Rishabh Pant: బీసీసీఐ బిగ్ అప్డేట్.. బ్యాటింగ్ కు అందుబాటులోనే రిషబ్ పంత్.. వికెట్ కీపర్ గా ఆ ప్లేయర్
- బ్యాటింగ్ కు అందుబాటులోనే రిషబ్ పంత్
- వికెట్ కీపింగ్ బాధ్యత ధ్రువ్ జురెల్ భుజాలపై ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ జూలై 23న ప్రారంభమైంది. కాగా మాంచెస్టర్ టెస్టు మొదటి రోజు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ పంత్కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. అయితే గాయం కారణంగా నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమవుతాడా అన్న సందేహాలపై బీసీసీఐ బిగ్ అప్ డేట్ ఇచ్చింది.
Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
కాలు గాయం అయినప్పటికీ, ఇంగ్లాండ్తో జరిగే మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) జూలై 24న (గురువారం) అప్డేట్ ఇచ్చింది. రెండవ రోజు ఆటకు రిషబ్ పంత్ జట్టులో చేరాడని, అవసరం మేరకు మాత్రమే బ్యాటింగ్ చేస్తాడని BCCI తెలిపింది. అయితే, ఈ మ్యాచ్లో రిషబ్ ఇకపై వికెట్ కీపింగ్ చేయడని BCCI స్పష్టం చేసింది. వికెట్ కీపింగ్ బాధ్యత ధ్రువ్ జురెల్ భుజాలపై ఉంటుంది.
Also Read:TG Inter Board : ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు.? భాషా సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు.!
‘మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజున రిషబ్ పంత్ కుడి కాలికి గాయమైంది. ఈ కారణంగా, అతను ఇకపై ఈ టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేయడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్కు వికెట్ కీపింగ్ బాధ్యత అప్పగించాము. అయితే, గాయం ఉన్నప్పటికీ, రిషబ్ పంత్ రెండవ రోజు జట్టుతో ఉంటాడు, అవసరమైతే బ్యాటింగ్కు అందుబాటులో ఉంటాడు’ అని BCCI తెలిపింది.
Also Read:TG Inter Board : ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు.? భాషా సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు.!
జూలై 23న మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ బంతిని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పంత్ గాయపడ్డాడు. బంతి అతని కుడి కాలి వేలికి తగిలింది, దాని వల్ల ఆ భాగం వాచింది. ఫిజియో పంత్ కు చికిత్స చేసినప్పటికీ అతను నిలబడే స్థితిలో లేడు. అలాంటి పరిస్థితిలో, అతన్ని అంబులెన్స్ ద్వారా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. 37 పరుగులు చేసిన తర్వాత పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲: Rishabh Pant, who sustained an injury to his right foot on Day 1 of the Manchester Test, will not be performing wicket-keeping duties for the remainder of the match. Dhruv Jurel will assume the role of wicket-keeper.
Despite his injury, Rishabh Pant has joined the…
— BCCI (@BCCI) July 24, 2025
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..