Hari Hara Veera Mallu: చివరి నిముషంలో ‘ఒడ్డున’ పడేసిన ఆ ఇద్దరు నిర్మాతలు!
- నిన్న రాత్రి హరిహర వీరమల్లు పార్ట్ 1 ప్రీమియర్లు
- క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం
- చివరి నిమిషంలో ఫైనాన్స్ ఇష్యూస్ను మైత్రి, విశ్వప్రసాద్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : Hari Hara Veera Mallu: నిజంగా అంత ఖర్చు అయ్యిందంటారా?
Also Read
- Purusha : సమ్మర్ రేసులో 'పురుష:'.. మే 22న థియేటర్లలోకి!
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
అయితే నిజానికి ఈ సినిమాకి దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో సినిమా రిలీజ్ చేసే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న నిర్మాత మైత్రి రవి ఎర్నేనితో పాటు గతంలో పవన్ కళ్యాణ్తో బ్రో లాంటి సినిమా చేసిన మరో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగి చివరి నిమిషంలో ఎదురైన ఫైనాన్స్ ఇష్యూస్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Kingdom : ఏపీలో కింగ్డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
వారిద్దరూ కొంత అమౌంట్కి అడ్డం ఉండి సినిమా రిలీజ్కి సహకరించినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాకి సంబంధించి 35 కోట్ల రూపాయలు చెల్లించి నైజాం హక్కులు కొనుగోలు చేసింది. ఆ అమౌంట్ కాకుండా మరికొంత అమౌంట్కి విశ్వప్రసాద్తో కలిసి మైత్రి సంస్థ అడ్డం ఉన్నట్లుగా సమాచారం. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఫైనాన్స్ క్లియర్ చేయడంతో ప్రీమియర్లు సమయానికి పడ్డాయి. నిజానికి 9:36 నిమిషాలకు ప్రీమియర్ల ముహూర్తం ఫిక్స్ చేసినా, దాదాపు పావుగంట 20 నిమిషాల లేటుగా షోలు పడ్డాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?