Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
- టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ చేసిన రిషబ్ పంత్
- క్రీజులోకి దిగే ముందు ఆయుధ పూజ చేసిన పంత్
- తన బ్యాట్.. గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మొక్కిన పంత్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తర్వాత టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్.. సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర ప్రమాదంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో దుమ్ము రేపాడు. దీంతో.. సెంచరీ చేశాడు. అతని టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత పంత్.. ఆకాశం వైపు చూసి కళ్లు మూసుకుని మరోసారి దేవుడిని ప్రార్థించాడు. అనంతరం తనదైన శైలిలో హెల్మెట్ తీసి.. అభిమానులకు బ్యాట్తో అభివాదం చేశాడు.
Read Also: Lucknow: ఎంతకు తెగించాడంటే.. డబ్బుల కోసం కొడుకు ఏం చేశాడంటే..?
Also Read
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్.. కేవలం 39 పరుగులు మాత్రమే చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 109 పరుగులు సాధించాడు. దీంతో.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. కాగా.. రెండవ ఇన్నింగ్స్లో 287 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. కాగా.. లక్ష్య ఛేదనలో బంగ్లా 234 పరుగులకు కుప్పకూలడంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also: MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!