Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
- టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ చేసిన రిషబ్ పంత్
- క్రీజులోకి దిగే ముందు ఆయుధ పూజ చేసిన పంత్
- తన బ్యాట్.. గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మొక్కిన పంత్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తర్వాత టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్.. సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర ప్రమాదంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో దుమ్ము రేపాడు. దీంతో.. సెంచరీ చేశాడు. అతని టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత పంత్.. ఆకాశం వైపు చూసి కళ్లు మూసుకుని మరోసారి దేవుడిని ప్రార్థించాడు. అనంతరం తనదైన శైలిలో హెల్మెట్ తీసి.. అభిమానులకు బ్యాట్తో అభివాదం చేశాడు.
Read Also: Lucknow: ఎంతకు తెగించాడంటే.. డబ్బుల కోసం కొడుకు ఏం చేశాడంటే..?
Also Read
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్.. కేవలం 39 పరుగులు మాత్రమే చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 109 పరుగులు సాధించాడు. దీంతో.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. కాగా.. రెండవ ఇన్నింగ్స్లో 287 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. కాగా.. లక్ష్య ఛేదనలో బంగ్లా 234 పరుగులకు కుప్పకూలడంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also: MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!