MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
- అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కొడుకుపై పోలీస్ కేసు..
- వ్యక్తిపై దాడి.. కిడ్నాప్ చేసిన అజిత్ ప్రసాద్..
- ఈ ఏడాది ఉప ఎన్నికల బరిలో దిగబోతున్న అజిత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Awadhesh Prasad: అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ లోక్సభ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తరుపున అవధేష్ ప్రసాద్ గెలిచి సంచలనం సృష్టించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ ప్రసాద్ పేరు మార్మోగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి, దాడి చేశారన్న ఆరోపణలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఇక్కడి కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్లో రవి తివారీ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది
Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా
Also Read
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
బీఎన్ఎస్ సెక్షన్లు 140 (3) (కిడ్నాప్), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 191 (3) (మారణాత్మకమైన ఆయుధాలతో అల్లర్లు చేయడం), 351 (3) ( నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూమి కొనుగోలు కేసులో కమీషన్ వివాదం తర్వాత శనివారం మధ్యాహ్నం ఫైజాబాద్ నగరంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కూడలి సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అజిత్ ప్రసాద్తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తివారీపై దాడి చేసి, కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
ప్రాపర్టీ డీలింగ్స్లో కూడా అజిత్ ప్రసాద్ ప్రమేయం ఉంది. వచ్చే యూపీ ఉప ఎన్నికల్లో మిల్కిపూర్ స్థానం నుంచి అజిత్ ప్రసాద్ ఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీగా అవధేష్ ప్రసాద్ గెలిచిన తర్వాత, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటుకు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అజిత్ ప్రసాద్పై ఫిర్యాదు చేసిన వ్యక్తి అయోధ్యలోని పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలియా రిసాలి గ్రామ వాసి. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!