MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
- అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కొడుకుపై పోలీస్ కేసు..
- వ్యక్తిపై దాడి.. కిడ్నాప్ చేసిన అజిత్ ప్రసాద్..
- ఈ ఏడాది ఉప ఎన్నికల బరిలో దిగబోతున్న అజిత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Awadhesh Prasad: అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ లోక్సభ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తరుపున అవధేష్ ప్రసాద్ గెలిచి సంచలనం సృష్టించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ ప్రసాద్ పేరు మార్మోగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి, దాడి చేశారన్న ఆరోపణలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఇక్కడి కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్లో రవి తివారీ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది
Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
బీఎన్ఎస్ సెక్షన్లు 140 (3) (కిడ్నాప్), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 191 (3) (మారణాత్మకమైన ఆయుధాలతో అల్లర్లు చేయడం), 351 (3) ( నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూమి కొనుగోలు కేసులో కమీషన్ వివాదం తర్వాత శనివారం మధ్యాహ్నం ఫైజాబాద్ నగరంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కూడలి సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అజిత్ ప్రసాద్తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తివారీపై దాడి చేసి, కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
ప్రాపర్టీ డీలింగ్స్లో కూడా అజిత్ ప్రసాద్ ప్రమేయం ఉంది. వచ్చే యూపీ ఉప ఎన్నికల్లో మిల్కిపూర్ స్థానం నుంచి అజిత్ ప్రసాద్ ఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీగా అవధేష్ ప్రసాద్ గెలిచిన తర్వాత, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటుకు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అజిత్ ప్రసాద్పై ఫిర్యాదు చేసిన వ్యక్తి అయోధ్యలోని పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలియా రిసాలి గ్రామ వాసి. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!