Revanth Reddy: ఆర్ఆర్ఆర్ పనుల ప్రారంభానికి అనుమతివ్వండి.. గడ్కరీకి సీఎం రేవంత్ వినతి!
- ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
- కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్
- ఆర్ఆర్ఆర్ పనుల ప్రారంభానికి అనుమతివ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక, క్యాబినెట్ అనుమతి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి కోరారు.
రావిర్యాల-ఆమన్గల్-మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మన్ననూర్-శ్రీశైలం (ఎన్హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి.. హైదరాబాద్-మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు.. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్లతో పంపిన రహదారుల పనులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Also Read: Asia Cup 2025: పసికూన హాంగ్ కాంగ్ను ఉతికారేసిన అఫ్గానిస్తాన్.. ఒమర్జాయ్ వీరవిహారం!
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందరు పోర్ట్ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్కు పంపుతానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో ఈ నెల 22వ తేదీన హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..