Revanth Reddy : రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. నేడు రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవి కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఎన్నికలు అని అన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది అని, పదేళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ భర్తీ చేయలేదు.. నిరుద్యోగ సమస్యను తీర్చలేదన్నారు రేవంత్ రెడ్డి. రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండని, మన భూములు మన చేతిలో ఉండాలంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘కేసీఆర్ కు ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే… కేసీఆర్ కాలనాగులాంటి వారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ వీధి కుక్కలా… ఆయన కొడుకు ఒక పిచ్చి కుక్కలా మారారు. రైతుల భూములను కాపాడేందుకే నేను కామారెడ్డిలో పోటీ చెస్తున్నా… మీ కోసం కొట్లాడుతా… గుంట భూమి గుంజుకోకుండా కంచె వేసి కాపాడుతా.. ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు… కామారెడ్డిలో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి… రూ.2000 కోట్ల భూములను గుంజుకోవాలని చూస్తుండు.. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్ ను ఓడించి బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తాం. కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలే.. కేసీఆర్ ను బొందపెడితే రూ.4వేలు పెన్షన్. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!