Revanth Reddy: ఎన్నికలు మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలకు తెర లేపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ సీపీ మాత్రం.. దాడి వెనక కుట్ర లేదు.. సెన్సేషన్ కోసం దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన ఐదుగురి రిమాండ్ రిపోర్టు బయట పెట్టాలని రేవంత్ కోరారు. కొత్త ప్రభాకర్ దాడి వెనక కుట్ర ఏందో బయట పెట్టాలని తెలిపారు. హరీష్ రావు.. పెట్రోల్ కొన్నాడు కానీ అగ్గిపెట్టే కొనలేదని విమర్శలు చేశారు.
Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
కొత్త ప్రభాకర్ పై దాడి చేసిన వ్యక్తి రాజు రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హరీష్ రావుకు.. దాడి చేసిన వ్యక్తికి మధ్య సంభాషణ ఉందా అని రేవంత్ అన్నారు. హరీష్ సన్నిహితులకు.. దాడి చేసిన వ్యక్తికి మధ్య ఏం సంభాషణ జరిగిందో బయట పెట్టాలని కోరారు. కేటీఆర్ ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంకో మూడు ఘటనలు జరుగుతాయి అని అంటుంటే కేసు పెట్టి.. విచారణ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన గువ్వల బాలరాజుపై మాట్లాడుతూ.. ఆయన కనిపించిన వాళ్ళ మీదల్లా దాడి చేస్తాడని తెలిపారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.
Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
ఎన్నికలు మొదలయినప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలు మొదలు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ నుండి బీఆర్ఎస్ కుట్ర అనే డ్రామా మొదలు పెట్టారన్నారు. తెలంగాణలో మోడీ, కేసీఆర్, ఎంఐఎంలు అన్ని కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు. సానుభూతి కోసం కేటీఆర్, హరీష్ రావు కుట్రలు అనే నాటకం మొదలుపెట్టారన్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల అధికారులు విచారణ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల డ్రామాలు నమ్మకండి.. దండుపాళ్యం ముఠా లాంటిది కేసీఆర్ కుటుంబం అని విమర్శలు చేశారు. వీళ్ళ నుండి ప్రజలు బయట పడాలి.. నాటకాలకు తెర దించాలని అన్నారు.
- Tags
- BRS
- congress
- harish rao
- kcr
- ktr
తాజావార్తలు
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!