CM Revanth Reddy: “నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసు”.. సీఎం ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలను కున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు… నాది అభిమానం అని.. నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీ కి పోవాలి అంటే ధైర్యం ఎందుకు? అభిమానం ఉండాలని తెలిపానన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి రూ. వెయ్యి కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు.
READ MORE: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
మారు మూల పల్లెల నుండి వచ్చిన వాణ్ణి అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.. మా అధికారులు కట్టలు కట్టలు పేపర్లు ఇచ్చి ఇది మాట్లాడండి అన్నారు.. మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తే నా మనసులో ఏమంటే అది మాట్లాడతా.. చూసి మాట్లాడను.. నాకేం అనిపిస్తే అదే మాట్లాడతా అని వాళ్లతో చెప్పినట్లు వివరించారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే.. పోరాటం పుట్టుకు వస్తుందని హితవు పలికారు. దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు చదువుకోలే.. ఆధిపత్యం చేసిన వాళ్ళపై పోరాటం పునాదిగా వేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశాం.. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టింది.. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారన్నారు.. “మా తమ్ముళ్ళు ఏం అడిగారు.. స్వేచ్ఛ అడిగారు.. ఫార్మ్ హౌస్ అడిగారా..? వాళ్ళ ఆస్తుల్లో వాటా అడిగారా? లేదు.. స్వేచ్ఛ మాత్రమే అడిగారు.. ఆ స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇస్తుంది.. మీరు గొప్ప మేధావులు గా ఎదగండి.. ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలపాలని చూశారు.. కానీ.. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే నా సంకల్పం.. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదు అంటున్నారు.. నేను గుంటూరులో చదువు కోలేదు.. గూడు పుటాని తెలియదు.. నల్లమలలో పెరిగాను.. పేదరికం చూశా.. దళితులు.. ముస్లింలతో కలిసి తిరిగాను.. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసుకునే విద్యా నాకు తెలుసు..” అని సీఎం రేవంత్రెడ్డి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?