CM Revanth Reddy: “నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసు”.. సీఎం ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలను కున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు… నాది అభిమానం అని.. నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీ కి పోవాలి అంటే ధైర్యం ఎందుకు? అభిమానం ఉండాలని తెలిపానన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి రూ. వెయ్యి కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు.
READ MORE: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
మారు మూల పల్లెల నుండి వచ్చిన వాణ్ణి అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.. మా అధికారులు కట్టలు కట్టలు పేపర్లు ఇచ్చి ఇది మాట్లాడండి అన్నారు.. మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తే నా మనసులో ఏమంటే అది మాట్లాడతా.. చూసి మాట్లాడను.. నాకేం అనిపిస్తే అదే మాట్లాడతా అని వాళ్లతో చెప్పినట్లు వివరించారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే.. పోరాటం పుట్టుకు వస్తుందని హితవు పలికారు. దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు చదువుకోలే.. ఆధిపత్యం చేసిన వాళ్ళపై పోరాటం పునాదిగా వేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశాం.. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టింది.. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారన్నారు.. “మా తమ్ముళ్ళు ఏం అడిగారు.. స్వేచ్ఛ అడిగారు.. ఫార్మ్ హౌస్ అడిగారా..? వాళ్ళ ఆస్తుల్లో వాటా అడిగారా? లేదు.. స్వేచ్ఛ మాత్రమే అడిగారు.. ఆ స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇస్తుంది.. మీరు గొప్ప మేధావులు గా ఎదగండి.. ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలపాలని చూశారు.. కానీ.. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే నా సంకల్పం.. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదు అంటున్నారు.. నేను గుంటూరులో చదువు కోలేదు.. గూడు పుటాని తెలియదు.. నల్లమలలో పెరిగాను.. పేదరికం చూశా.. దళితులు.. ముస్లింలతో కలిసి తిరిగాను.. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసుకునే విద్యా నాకు తెలుసు..” అని సీఎం రేవంత్రెడ్డి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!