Revanth Reddy : ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా వర్ధన్నపేట విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చెప్పులు గతి లేని వ్యక్తులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారన్నారు. ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారని, అడ్డుకోబోతే పోలీస్ బూట్లతో తన్నించారన్నారు రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయలేదని, ఎన్నికలు వస్తున్నాయని తాత్కాలికంగా పక్కన పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రైతుల మెడ మీద కత్తిలా ఉందని, కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థులు త్యాగం చేస్తే ఇప్పుడు వాళ్ళను అణచివేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, శ్రీశైలం శ్రీ మల్లికార్జున కల్యాణం
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అంతేకాకుండా..’మూడో సారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు కేసీఆర్. కేసీఆర్ మనవనికి కూడా పదవి కావాలని చూస్తున్నాడు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు కేసీఆర్. తెలంగాణ రైతులను, మీడియాను తీసుకొని కాళేశ్వరం వెళ్దాం. ఇసుక కదిలితే బ్యారేజ్ వంగుతదా… బుద్దున్నొడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా.. చెప్పు తీసుకొని కొట్టండి కేసిఆర్ ను. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న సన్నాసి, ఎంత మందికి ఇచ్చావు. వెయ్యి ఎకరాల ఫార్మ్ హౌస్ కట్టుకున్నవు. హైదరాబాద్ లో పది ఎకరాల గడీని కట్టుకున్నాడు. ఇంటికో ఉద్యోగం అని ప్రజల్ని మోసం చేసి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల ప్రారంభంలో జీతం ఇచ్చాము. 20 వ తేదీ వచ్చినా జీతాలు ఇయ్యలేని దుస్తితి తెచ్చాడు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎర్రబెల్లి కరెంట్ తీసేస్తా. కల్వకుంట్ల కుటుంబం ట్రాన్స్ఫార్మర్ లు పేలిపోతాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే దొర దగ్గర బానిసలుగా పడిఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీకోసం ప్రశ్నిస్తారు. హామీ ఇచ్చి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6గ్యారెంటీలు ఇప్పుడు హామీ ఇస్తున్నాం, వచ్చే నెలలో ఇచ్చి తీరుతాం.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ ట్రాప్లో ప్రముఖ కంపెనీ.. ఉచ్చు బిగుస్తోంది..!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!