CM Revanth Reddy : నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్లు వస్తాయి
- ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి విమర్శలు
- పాలనలో మార్పు అవసరం – ప్రజలకు చేరువ కావాలని సూచన
- శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్లను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల అనుభవాలను నేటి ఐఏఎస్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ఐఏఎస్ అధికారులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను నేరుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
గతంలో ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులకు ప్రామాణిక సమాచారాన్ని అందించేవారని, రాజకీయ నిర్ణయాల్లో లాభనష్టాలను విశ్లేషించి వివరించేవారని, కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. రాజకీయ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావాన్ని ప్రభుత్వం నడిపించే అధికారులే అర్థం చేసుకోవాలని, కానీ ఇప్పుడు అలాంటి దృక్పథం తగ్గిపోయిందని అన్నారు.
Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్లోకి
శంకరన్, టీఎన్ శేషన్, మన్మోహన్ సింగ్ల వంటి అధికారులు తమ సేవల ద్వారా దేశానికి ఎంతో కొంత న్యాయం చేశారని, ఐఏఎస్ అధికారులు వారి మార్గంలో నడవాలని సూచించారు. శంకరన్ పేదల కోసం పనిచేసిన గొప్ప అధికారి అని, శేషన్ పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి అని, మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టిన నేత అని గుర్తుచేశారు.
ఒక ఐఏఎస్ అధికారి తన పని ప్రామాణికంగా నడిపించుకుంటే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడని అన్నారు. నిజమైన సేవగల అధికారి రాజకీయ నాయకులకంటే ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందుతాడని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వారధిగా ఐఏఎస్ అధికారులు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని, పాలనలో పారదర్శకత ఉండాలంటే అధికారులకు సమర్థమైన మార్గదర్శకత్వం అవసరమని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారులు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనను మళ్లీ తీసుకురావాలని పిలుపు ఇచ్చారు. పాలనలో నిబద్ధత చూపే వారికే గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్య ధోరణిని వీడి ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. పేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని, సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. అధికారుల ఆలోచనలో మార్పు రావాలని, వారి విధానం పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని సూచించారు.
Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!