Revanth Reddy : కేసీఆర్ను ఇంకెవరూ కాపాడలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ను ఇంకెవరూ కాపాడలేరన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీఎం మారారా.? కాంగ్రెస్లో ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. బీఆర్ఎస్లో సీఎం అవుతానని చెప్పే ధైర్యం హరీష్రావుకు ఉందా.?అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్లో ఉద్యమకారులకు సీట్లిచ్చాం. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. బీఆర్ఎస్లో ఉంటేనే తెలంగాణ ఉద్యమకారుడా..? తెలంగాణ ద్రోహులు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఏ రోజు తెలంగాణను వద్దని చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం సీట్లిచ్చాం. పార్టీ ఫిరాయించినవారికి, కాంట్రాక్టర్లకు కేసీఆర్ పదవులిచ్చారు. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. శ్రీకాంతచారి తల్లికి ఓడిపోయే సీటిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారం కుటుంబం కోసమే వాడుతున్నారు. కాంగ్రెస్కు అధికారం వచ్చినా సోనియా కుటుంబం పదవులు తీసుకోలేదు. మొన్నటివరకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని అన్నారు. గాంధీభవన్లో ఈటలు తోలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే ఈ ఆరోపణలు. ధరణి లోపభూయిష్టమైన వ్యవస్థ. కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారుల కుటుంబం. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోంది. రెవెన్యూ రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతికి రికార్డులిచ్చే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారు. భూ భారతి కింద డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేపట్టిందే గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్. ధరణి వచ్చాక.. హైదరాబాద్లో ఉంటున్న కొందరు వందల ఎకరాలకు ఆసాములయ్యారు. ఎప్పుడో ఊళ్లలో భూములు అమ్ముకున్నవాళ్ల పేర్లు.. ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయి..? ‘ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!