Revanth Reddy : నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుటుంబంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు, సాండ్ లాండ్ మైన్ వైన్ వ్యాపారాలు చేస్తూ ప్రజల్ని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. సాక్షాత్తు కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా దాడులు చేశారని ఆయన అన్నారు. తనుగుల గ్రామం వద్ద ఎంపీ సంతోష్ తండ్రి బినామీ పేర్లతో ఇసుక క్వారీ నిర్వహిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీగా ఈ క్వారీని సందర్శించామన్నారు. యథేచ్ఛగా ప్రొక్లైన్స్ వినియోగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని, అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు.. మేము అడిగినా అందుబాటులోకి అధికారులు రాలేదని ఆయన అన్నారు.
Also Read : Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అంతేకాకుండా..’క్వారీ వల్ల బోర్లు ఎండిపోయి నిరసన తెలిపిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇసుక మాఫియాతో ఉన్న చీకటి అనుబందంపై సీఎం సమాధానం చెప్పాలి.. క్వారీ వల్ల బోర్లు ఎండుతున్నాయ్ రోడ్లు నాశనం అయ్యాయి.. ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు… కేసీఆర్ కుటుంబం ప్రత్యక్ష పాత్ర వల్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయి.. ప్రభుత్వం పై పోరాటం చేస్తా.. కేసీఆర్ పై యుద్ధం అని ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎక్కడున్నారు… ఈటల నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే ఈటల ఏం చేస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ మిలకత్ లో భాగంగానే ఈటల మౌనం.. ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల ఏం చేస్తున్నారు… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఎందుకు వెళ్ళలేదు.. కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది.. రైతులకు, ప్రజలకు అండగా ఉంటాం.. బీజేపీ నాయకులు అధికారం కోరుకుంటున్నారు… ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీ పై బీజేపీ వైఖరి బండి సంజయ్, ఈటల చెప్పాలి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి కారణం ఇసుక క్వారీలే.’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ‘నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది.. లాండ్, సాండ్, మైన్ ఏదైనా కాదేదీ దోపిడికి అనర్హం అంటూ.. రాజ్యమేలుతున్న ఈ చీడ పురుగులను తెలంగాణ పోలిమేరల దాకా తరిమేందుకే ఈ “యాత్ర”’ అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Also Read : Scientific mystery thriller: ‘కరాళ’గా రాబోతున్న కన్నడ ‘బీగా’!
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!