Revanth Reddy : నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుటుంబంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు, సాండ్ లాండ్ మైన్ వైన్ వ్యాపారాలు చేస్తూ ప్రజల్ని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. సాక్షాత్తు కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా దాడులు చేశారని ఆయన అన్నారు. తనుగుల గ్రామం వద్ద ఎంపీ సంతోష్ తండ్రి బినామీ పేర్లతో ఇసుక క్వారీ నిర్వహిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీగా ఈ క్వారీని సందర్శించామన్నారు. యథేచ్ఛగా ప్రొక్లైన్స్ వినియోగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని, అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు.. మేము అడిగినా అందుబాటులోకి అధికారులు రాలేదని ఆయన అన్నారు.
Also Read : Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
అంతేకాకుండా..’క్వారీ వల్ల బోర్లు ఎండిపోయి నిరసన తెలిపిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇసుక మాఫియాతో ఉన్న చీకటి అనుబందంపై సీఎం సమాధానం చెప్పాలి.. క్వారీ వల్ల బోర్లు ఎండుతున్నాయ్ రోడ్లు నాశనం అయ్యాయి.. ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు… కేసీఆర్ కుటుంబం ప్రత్యక్ష పాత్ర వల్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయి.. ప్రభుత్వం పై పోరాటం చేస్తా.. కేసీఆర్ పై యుద్ధం అని ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎక్కడున్నారు… ఈటల నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే ఈటల ఏం చేస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ మిలకత్ లో భాగంగానే ఈటల మౌనం.. ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల ఏం చేస్తున్నారు… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఎందుకు వెళ్ళలేదు.. కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది.. రైతులకు, ప్రజలకు అండగా ఉంటాం.. బీజేపీ నాయకులు అధికారం కోరుకుంటున్నారు… ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీ పై బీజేపీ వైఖరి బండి సంజయ్, ఈటల చెప్పాలి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి కారణం ఇసుక క్వారీలే.’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ‘నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది.. లాండ్, సాండ్, మైన్ ఏదైనా కాదేదీ దోపిడికి అనర్హం అంటూ.. రాజ్యమేలుతున్న ఈ చీడ పురుగులను తెలంగాణ పోలిమేరల దాకా తరిమేందుకే ఈ “యాత్ర”’ అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Also Read : Scientific mystery thriller: ‘కరాళ’గా రాబోతున్న కన్నడ ‘బీగా’!
తాజావార్తలు
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?