CM Revanth Reddy : నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్.. కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం
- నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్
- ముగ్గురు కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం
- ఆశాఖలపైనే అందరి దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
సాధారణంగా ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని గంటల్లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదలవుతుంటుంది. కానీ ఈసారి ఆలస్యం జరుగుతోంది. ఇందుకు ముఖ్య కారణం శాఖల విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, సామాజిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సేవలు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగించే విషయమై రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలు అధిష్టానానికి వివరించినట్టు సమాచారం.
మరోవైపు, కొంతకాలంగా శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పాత మంత్రుల్లో కొందరు కీలకమైన హోంశాఖను కోరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వంటి నేతలు శాఖ మార్పును కోరినట్టు సమాచారం. మున్సిపల్ శాఖపై కూడా పలువురు మంత్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ శాఖల మార్పులు వల్ల పాత మంత్రుల అసంతృప్తి తలెత్తే అవకాశముందని అధిష్టానం పరిశీలించినట్టు తెలిసింది. అందువల్ల మంత్రుల మధ్య సమతుల్యత పాటించేలా సమన్వయం చేసేందుకు హైకమాండ్ రేవంత్ను ఢిల్లీకి పిలిపించిందని అంటున్నారు.
US: అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్
ఇక, మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ హామీ వల్లే వారు అసంతృప్తిని బయటపెట్టలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రేవంత్ రెడ్డి ఖర్గేతో మరోసారి సమావేశమై శాఖల కేటాయింపు విషయంపై తుది చర్చలు జరపనున్నారు. అనంతరం ఖర్గే ఆమోదంతో మంత్రుల శాఖల ప్రకటన వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!