Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!
- తమిళనాడులోని తీవ్ర ఉద్రిక్తత..
- అన్నామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి..
- నాన్ వెజ్ తిన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి నాన్ వెజ్ తింటున్నట్లు భక్తులు గమనించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆలయాధికారులు అతడి దగ్గరికి వచ్చి ఏం తింటున్నాడని ప్రశ్నించగా.. సదరు వ్యక్తి తాను ‘కుస్కా’ (సాదా బిర్యానీ) ఆర్డర్ చేసుకున్నాను. కానీ, పొరపాటున దాంతో పాటు చికెన్ ముక్కను ప్యాక్ చేశారని తెలిపాడు.
Also Read
దీంతో ఆలయ అధికారులు ఆ వ్యక్తి తినే ఆహారాన్ని ప్యాక్ చేయించి.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అలాగే, విచారణ కోసం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేందుకు తరుచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో హిందువులను కించపర్చేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే, జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మధురైలోని పవిత్రమైన తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ దగ్గర ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత, రామనాథపురం ఎంపీ నవాస్ ఖనిని మాంసాహారం తిన్నారని బీజేపీ నేత కె. అన్నామలై ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడి మాటలను ఐయూఎంఎల్ ఎంపీ ఖండించారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో బీజేపీ మొదటి వరుసలో ఉంటుందని అతడు పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!