Renuka Chowdhury : ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమిత్ షా టాక్స్, అంబానీ టాక్స్ విన్నామని, ఆర్, ఆర్ టాక్స్ వినలేదన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారని, ఢిల్లీ పోలీసులకు మాతెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు రేణుకా చౌదరి. మర్యాదగా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళని విడిచిపెట్టండని, ప్రజ్వల్ రెవన్న ను ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ లో మహిళల పై దుర్భాషలాడిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆమె విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ పై మోడీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు రేణుకా చౌదరి. ఇలాంటి సంస్కారం లేని మోడీ మహిళలపై ప్రేమ కురిపిస్తుండని, కాంగ్రెస్ సోషల్ మీడియా పై కక్ష కట్టారన్నారు. రైతుల పైన జీవు తో తొక్కించి చంపిన బ్రిజ్ భూషణ్ కొడుక్కి పార్లమెంట్ టికెట్ ఇచ్చారని,
అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నారా మోడీ అని ఆమె అన్నారు. మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో హిందువులకు ఉన్న హక్కులు మిగతా అన్ని వర్గాలకు ఉన్నాయని, నరేంద్ర మోడీ కేవలం హిందువలకు మాత్రమే ప్రధాన మంత్రా? ముస్లింలకు ప్రధాన మంత్రి కాదా? అని నిలదీశారు. మధించిన ఏనుగు మాదిరిగా వ్యవస్థ లన్నింటిని తొక్కివేస్తూంటే చూసి సిగ్గుపడుతున్నామన్నారు. ముస్లిం దేశాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, హిందూ ధర్మాన్ని గౌరవించి కోట్లాది రూపాయలు వెచ్చించి తమ దేశాలలో హిందూ దేవాలయాలను నిర్మించి ప్రధాని మోడీని స్వాగతిస్తే ఆయన మాత్రం మీ దేశంలో ముస్లింలను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ చర్యలను చూసి ఆ దేశాల్లో ఉండే హిందువులు భయాందోళనలతో గడుపుతున్నారన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి మన వారు విదేశాల్లో సత్తా చాటేలా చేశారన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్ల విదేశాల్లో ఉన్న మనవారిపై అక్కడి వారు తిరగబడితే వాళ్లందరు ఏమైపోతారని కూడా ఆలోచించరా? అని ఫైర్ అయ్యారు.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!