High Court : ఐఏఎస్లకు దక్కని ఊరట.. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలన్న హైకోర్టు
- కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తాం
- రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేం
- ప్రజాసేవ కోసమే ఐఏఎస్లు
- ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలి : హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజాసేవ కోసమే ఐఏఎస్లు అని, ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదని, మీ వాదనలు వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!
Also Read
- IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- CM Yogi Adityanath: దేశానికి "ధర్మ హింస" అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
- Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
అయితే.. ఇటీవల, డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు, రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ వంటి వారు హైకోర్టుకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వద్ద తమ బదిలీని నిలిపివేయాలని కోరగా, అక్కడ వారు నిరాకరించడంతో, తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది.
ఐఏఎస్ ల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని, క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని హై కోర్ట్ కోరిందన్నారు. ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని కోర్ట్ కు తెలిపామని, ఐఏఎస్ పిటిషన్ లను క్యాట్ అడ్మిట్ చేసుకుంది అని ఆయన తెలిపారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4 కు వాయిదా వేసిందని ఐఏఎస్ కౌన్సిల్ తెలిపారు. అప్పటి వరకు ఐఏఎస్ లను రిలీవ్ చేయకుండా ఉండలే ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ కౌన్సిల్ కోరింది.
తాజావార్తలు
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
-
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..