KTR Case: హైకోర్టులో కేటీఆర్కు ఊరట..
- హైకోర్టులో కేటీఆర్కు ఊరట
- ఈ నెల 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
- తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Relief for KTR in High Court: హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది.
Read Also: Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ వాడీవేడిగా జరిగింది. కేటీఆర్ తరపు లాయర్, ప్రభుత్వ తరపు లాయర్ మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ క్రమంలో.. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా ఏసీబీని ఆదేశించండని కోర్టుకు కేటీఆర్ లాయర్ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వండని కోరారు. మరోవైపు.. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది.. ప్రతి విషయం ఎఫ్ఐఆర్ లో ఉండదని అన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయని తెలిపారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది.. రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారు.. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని ప్రభుత్వ తరపు లాయర్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని జడ్జ్ అడిగారు.
Read Also: Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..
దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్యులైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని ఏజీ అన్నారు. విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింది.. ఈ ఏడాది నిర్వహించాలనుకున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసమే చెల్లింపులు జరిగాయని ఏజీ తెలిపారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని ఏజీ పేర్కొన్నారు. FEOకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయి.. హెచ్ఎండీఏ ఇందులో భాగస్వామి కాకున్నా 55 కోట్లు చెల్లించిందన్నారు. ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ది చేకూరిందని ఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎవరెవరికి ఎలాంటి లబ్ది చేకూరిందనేది దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.
తాజావార్తలు
-
Shah Rukh Khan: “నా భర్త కంటే మీరే ఇష్టం”.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!