Qatar Court: 8 మంది భారత నేవీ మాజీ అధికారుల ఉరిశిక్ష వ్యవహారం.. మరణశిక్షను జైలుశిక్షగా తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar Commutes Death sentence of 8 Indian ex-Navy personnel: గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన మరణ శిక్షలను తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్ అప్పీల్ కోర్టు శిక్షలను తగ్గించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, కోర్టు ఏమి చెప్పిందో పేర్కొనలేదు. భారత నేవీ మాజీ సిబ్బందికి విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఆమోదించిన వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఖతార్లోని భారత రాయబారి, ఇతర అధికారులు అరెస్టయిన మాజీ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి కోర్టును ఆశ్రయించారు. ఖతార్లోని దహ్రా గ్లోబల్ కేసులో మరణశిక్ష విధించడంపై కేసు ప్రారంభం నుంచి మాజీ సిబ్బంది, వారి కుటుంబాలకు అండగా ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని ఖతార్ అధికారులతో కూడా మాట్లాడుతామని వెల్లడించింది. “దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్ అప్పీల్ కోర్టు తీర్పును ఈరోజు గమనించాం, ఇందులో శిక్షలు తగ్గించబడ్డాయి. వివరణాత్మక తీర్పు కోసం వేచి ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
Read Also: Bus Accident: 13 మందిని బలిగొన్న ఫిట్నెస్ లేని బస్సు.. బీజేపీ నేతకు చెందినదిగా గుర్తింపు
ప్రైవేట్ కంపెనీ అల్ దహ్రాతో కలిసి పనిచేసిన భారతీయ పౌరులు గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది ఆగస్టులో అరెస్టయ్యారు. ఎనిమిది మంది నేవీ సిబ్బంది ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారని ఖతార్ ఆరోపించింది. ఖతార్ భద్రతా సంస్థ ఆగస్టు 30న అందరినీ అరెస్టు చేసింది. వీరంతా భారత నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ చేసి దోహాలోని అల్-దహ్రా కంపెనీలో పనిచేశారు. ఇజ్రాయెల్ కోసం ఖతార్ జలాంతర్గామి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారని ఖతార్ అధికారులు ఆరోపించారు. ఖతార్ అధికారులు భారతీయ పౌరులపై ఆరోపణలను బహిరంగపరచలేదు. ఇదిలా ఉండగా,, ఖతార్ నుంచి ఖైదు చేయబడిన మాజీ నేవీ సిబ్బందిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు.
Read Also: Captain Vijayakanth: కెప్టెన్ విజయ్ కాంత్ హత్య.. దర్శకుడి సంచలన ఆరోపణలు?
అక్టోబరు 26న ఖతార్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ ద్వారా నేవీ మాజీ సిబ్బందికి మరణశిక్ష విధించింది. భారతదేశం ఈ తీర్పును తీవ్రమైన దిగ్భ్రాంతికరమైనదిగా అభివర్ణించింది. కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గత నెలలో ఈ కేసుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు, అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. మార్చి 25న భారతీయ పౌరులపై అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఖతార్ చట్టం ప్రకారం వారిని విచారించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..