IPL 2025-RCB: ఆర్సీబీకి బిగ్ షాక్..18 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ అవుట్!
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్
- ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ అవుట్
- అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్గా హేజిల్వుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ ఐపీఎల్ 2025లోని మిగతా మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. భుజం గాయం ఇంకా తగ్గని కారణంగా ఆసీస్ వెళ్లిన హేజిల్వుడ్.. భారత్ తిరిగి వచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ సీజన్లో హేజిల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్గా ఉన్నాడు.
భుజం నొప్పితో బాధపడుతున్న జోష్ హేజిల్వుడ్ మే 3న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్తో బెంగళూరు ఆడే మ్యాచ్కు కూడా అతడు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. ఈ లోపే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడింది. స్వదేశం వెళ్లిన హేజిల్వుడ్.. మరలా ఐపీఎల్ 2025 ఆడే అవకాశాలు లేవు. దక్షిణాఫ్రికాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సమీపిస్తున్నందున హేజిల్వుడ్ ఫిట్గా ఉండేలా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంటోంది.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
Also Read: Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!
ఐపీఎల్ వాయిదా పడడం, భారత్లో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశాలకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 లేదా 16న ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మే 13 నాటికి ప్లేయర్స్ అందరూ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే కొత్త షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువైంది. దాదాపుగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అయింది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!