RBI Banking Reforms: 2026 నుంచి కొత్త బ్యాంకింగ్ చట్టాలు అమల్లోకి.. లాకర్ దొంగతనాలకు100 రెట్ల పరిహారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Banking Reforms: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా RBI 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై నవంబర్ 10 వరకు అభిప్రాయాలు కోరుతోంది. ప్రజల నుంచి, అభిప్రాయం బ్యాంకింగ్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిబంధనలు 2026 నాటికి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ సేవలను సరళీకృతం చేయడం, బ్యాంకులకు జవాబుదారీతనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని వెల్లడించింది.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
సైబర్ మోసాలపై ఉక్కుపాదం..
ఎవరైనా ఒక కస్టమర్ ఖాతా సైబర్ మోసానికి గురైన మూడు రోజుల్లోపు బ్యాంకుకు సమాచారం అందిస్తే, కస్టమర్కు ఎటువంటి నష్టం జరగదని RBI పేర్కొంది. అంతేకాకుండా బాధిత కస్టమర్ ఫిర్యాదుకు బ్యాంకులు సకాలంలో చర్య తీసుకోవడంలో విఫలమైతే, సంబంధిత బ్యాంకులపై బాధితులు రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చని వెల్లడించింది. దీనివల్ల బ్యాంకులు సైబర్ భద్రత గురించి మరింత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. అలాగే లాకర్ సంబంధిత వివాదాలలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద మార్పు చేసినట్లు తెలిపింది. బ్యాంకు నిర్లక్ష్యం లేదా భద్రతా లోపం కారణంగా కస్టమర్ లాకర్ దొంగిలించబడినా లేదా దెబ్బతిన్నా, బ్యాంకు లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తాజా ముసాయిదాలో తెలిపింది.
కొత్త నియమాలు KYC ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నాయి. సాధారణ ఖాతాల కోసం KYC ప్రతి 10 ఏళ్లకు ఒకసారి, మధ్యస్థ-రిస్క్ ఖాతాలకు ప్రతి 8 ఏళ్లకు ఒకసారి, అధిక-రిస్క్ కస్టమర్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూర్తవుతుంది. ఇది వినియోగదారులకు పదే పదే పత్రాలను సమర్పించే ఇబ్బంది నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రుణ సంబంధిత విషయాలలో కూడా కస్టమర్లకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఏకరీతి సూత్రాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకుల పారదర్శకతను నిర్ధారిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా అన్ని రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించింది. ఇది కస్టమర్లు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా షెడ్యూల్కు ముందే తమ రుణాలను తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుందని తెలిపింది.
70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. దీని అర్థం వారు బ్యాంకులను సందర్శించాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు అధికారులే వారి ఇంటి వద్ద అవసరమైన సేవలను అందిస్తారు. ప్రజలు, బ్యాంకుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ కొత్త నియమాలు జనవరి 1, 2026, ఏప్రిల్ 1, 2026 మధ్య దశలవారీగా అమలు చేయనున్నట్లు RBI పేర్కొంది. ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచుతాయని, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మరింత జవాబుదారీగా చేస్తాయని వెల్లడించింది.
READ ALSO: India Defence Deals: నవంబర్ 23న భారత ఆర్మీకి నిజమైన దీపావళి.. ఈ బాంబులు పడితే పాక్ భస్మమే!
తాజావార్తలు
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..