Kuwait Fire Accident: కొడుకు కువైట్కు వెళ్లడం ఇష్టం లేదు.. మృతుడి తల్లితండ్రుల రోదన
- కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన రాంచీకి చెందిన వ్యక్తి
- మృతుడు మహమ్మద్ అలీ హుస్సేన్
- మరణవార్త తెలిసిన తర్వాత దు:ఖ సాగరంలో కుటుంబం
- తన కొడుకు కువైట్ కు వెళ్లడం ఇష్టం లేదు- పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ముబారక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఇంట్లో దేనికీ లోటు లేదని అన్నాడు. తన కొడుకు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం తనకు, తన భార్యకు ఇష్టం లేదని తీవ్రంగా విలపిస్తున్నారు. ఎలాగైనా కువైట్ కు వెళ్లి జీవితలంలో మంచి స్థాయిలో ఉన్న అలీ కల.. కల గానే మిగిలిపోయిందని తండ్రి తీవ్ర దు:ఖంతో చెబుతున్నాడు. అయితే.. తన కొడుకు చనిపోయినట్లు తల్లికి ఇంకా తెలియదు.
Ganja Gang Hulchul: కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
అగ్నిప్రమాద ఘటనకు ముందు.. మృతుడు అలీ కువైట్ నుండి తన కుటుంబంతో రోజు ఫోన్లో మాట్లాడుతుండే వాడని.. జూన్ 12 తర్వాత అకస్మాత్తుగా కమ్యూనికేషన్ ఆగిపోయిందని తండ్రి చెప్పాడు. దీంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యమన్నాడు.అలీ వాట్సాప్ ఆన్లైన్లో కూడా లేడని తెలుసుకుని.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. సౌదీ అరేబియాలో ఉన్న అలీ మామ తన పాస్పోర్ట్ వివరాలను కువైట్లోని ఒక తెలిసిన వ్యక్తి పంపించగా.. అతను ఆసుపత్రిలో మరణించి ఉన్నాడని చెప్పాడన్నాడు. అలీ తండ్రి వ్యాపారం చేస్తుంటాడు. అలీకి తల్లి, ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. అతని సోదరుడు ఆదిల్ హుస్సేన్ మక్కాలో నివసిస్తుండగా, అతని సోదరి నౌషీన్ టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతుంది.
Health Tips : పెరుగును వీటితో కలిపి అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
కువైట్ అగ్నిప్రమాదానికి గురైన 49 మందిలో 45 మంది భారతదేశానికి చెందినవారు ఉన్నారు. కేరళ నుండి 23 మంది, తమిళనాడు నుండి ఏడుగురు, ఉత్తర ప్రదేశ్ నుండి ఒక్కొక్కరు ముగ్గురు.. ఒడిశా నుండి ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!