Health Tips : పెరుగును వీటితో కలిపి అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత రుచికరమైన బిర్యానీ తిన్నా కూడా పెరుగు వేసుకోకుండా తింటే అసలు భోజనం చేసినట్లే ఉండదు అని చాలా మంది అంటుంటారు.. పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో చాలా మందికి తెలియదు.. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూసేద్దాం..
పెరుగు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాంటి పెరుగును కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. చేపల వేపుడు లేదా పులుసు తిన్నాక వెంటనే పెరుగుతో భోజనం చేస్తారు. ఇలా అస్సలు తినకూడదు. ఇవి రెండూ విరుద్ధ స్వభావం కల ఆహారాలు.. ఈ రెండు వ్యతిరేకం.. కడుపులో అజీర్తి చేసినట్లు ఉంటుంది.. అంతేకాదు గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..
Also Read
కొంతమంది మామిడి పండ్లను పెరుగుతో కలిపి తీసుకుంటారు.. మామిడి వేడి, పెరుగు చలువ.. ఇవి కూడా వ్యతిరేకం అందుకే వీటిని అస్సలు తీసుకోకూడదు. ఉల్లిపాయలను చాలా మంది పెరుగులో నంజుకుని తింటారు. కానీ ఈ రెండింటినీ కలిపి తినకూడదట. తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాని నిపుణులు చెబుతున్నారు.. పాలు, పెరుగు రెండూ ఒకే జాతికి చెందినవి. అయినప్పటికీ రెండింటినీ ఒకేసారి తీసుకోరాదు.. అలాగే నూనె లేదా కొవ్వు పదార్థాలతోనూ పెరుగును కలిపి తినరాదు.. పెరుగును తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకొని తినడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!