‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ భారీ చిత్రం కోసం గ్రౌండ్ వర్క్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
సుకుమార్ సాధారణంగా తన స్క్రిప్ట్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈసారి రామ్ చరణ్ కోసం సరికొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా సుకుమార్ శిష్యుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ ఒక స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉండగా, సుకుమార్ తన వ్యక్తిగత టీమ్తో కలిసి గోవాలో మరొక కథపై కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు కథల్లో చరణ్ ఇమేజ్కు ఏది బాగా సెట్ అవుతుందో దానిని ఫైనల్ చేయనున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో కథను మరింతగా మెరుగుపరిచేందుకు ఆయన టీమ్ కథపై కసరత్తులు చేస్తోంది. సుకుమార్ మార్కు ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి, చరణ్ మాస్ అప్పీల్ తోడైతే మరో ‘రంగస్థలం’ మించిన మ్యాజిక్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉండగా, సుకుమార్ ‘పుష్ప 2’ పనుల్లో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే చరణ్ – సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది.