Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Elections: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్ సుప్రియో వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. అయితే, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది.
READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
బీహార్: కుష్వాహా వర్సెస్ ఏడీ సింగ్
బీహార్లో ఐదు స్థానాలకు గాను నితీష్ కుమార్, రామ్నాథ్ ఠాకూర్ (JDU), నితిన్ నబిన్, శివం కుమార్ (BJP) విజయం ఖాయమైంది. అయితే, ఐదో సీటు కోసం ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహా, మహాఘటబంధన్ అభ్యర్థి ఏడీ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సీటును గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం విపక్ష కూటమికి 35 మంది ఉన్నారు. తేజస్వి యాదవ్కు మద్దతుగా AIMIM ఎమ్మెల్యేలు నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది.
ఒడిశా: క్రాస్ ఓటింగ్పైనే ఆశలు!
ఒడిశాలో ఒక సీటు గెలవడానికి 30 ఓట్లు అవసరం. ఇక్కడ బీజేపీకి ఇద్దరు, బీజేడీకి ఒక అభ్యర్థి విజయం సులభమే. కానీ, బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న దిలీప్ రే గెలవాలంటే మరో 8 ఓట్లు అదనంగా కావాలి. కాంగ్రెస్, బీజేడీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే నమ్మకంతో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఎం కలిసి 33 ఓట్లతో ఒక స్థానాన్ని గెలుచుకునే స్థితిలో ఉన్నాయి.
హర్యానా: క్యాంప్ రాజకీయాలు షురూ!
హర్యానాలో బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి కరంవీర్ బోధ్ గెలుపు దాదాపు ఖాయం. కానీ, స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్ రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ తన 31 మంది ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయితే, భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫోగట్ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ క్యాంప్కు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నేడు (సోమవారం) జరగనున్న పోలింగ్లో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!