తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న అప్డేట్ అయిన కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ఓ హాలివుడ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా జక్కన మూవికి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు.
Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
ఒక పక్కా ఫారెస్ట్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ సుమారు 3 గంటల 20 నిమిషాల నిడివితో ఉండబోతోందని. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్లపై అద్భుతమైన విజువల్స్తో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్’తో ఈ సినిమాను పోల్చడంపై రాజమౌళి స్పందిస్తూ.. కామెరూన్ ఒక శిఖరం వంటివారని, ఆయనతో తనను పోల్చవద్దని వినమ్రంగా కోరారు. అయితే, ఈ చిత్రంలోని 25 నిమిషాల పురాణ సన్నివేశాలు ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్తాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
