MP Bharat Ram: ఆ రెండు పార్టీలకు సిగ్గుందా?.. రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాణాసంచా విక్రయ బజారు ప్రారంభోత్సవానికి వచ్చిన భరత్ మీడియాతో మాట్లాడారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పోటీ నుంచి చంద్రబాబు తప్పుకున్నారని అన్నారు. అంటే పవన్ బీజేపీకి, చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Read Also: MLA Shankar Rao: నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఈ జనసేన, టీడీపీ చేతులు కలిపి ఎన్నికలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని ఎంపీ భరత్ అన్నారు. ఇదెక్కడి రాజకీయాలో, ఇవేమి తెలివితేటలో.. ఈ రెండు పార్టీల వ్యవహార తీరు చూసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలూ అసహ్యించుకుంటున్నారని తెలిపారు. విలువలకు తిలోదకాలిచ్చి కేవలం అధికార దాహంతో ఈ విధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ ఎప్పుడూ మద్దతివ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎంపీ భరత్ తెలిపారు. అంశాల వారీగా అదీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బీజేపీతో సఖ్యతగా ఉంటున్నామని..స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి పనులు, నిధులు సాధించుకోవడంలో సఫలీకృతం అయ్యామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read Also: Pithani Satyanarayana: జగన్ పై ప్రజలకు నమ్మకం లేదు.. అందుకే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు
జనసేన బీజేపీతో పొత్తు, ఆంధ్రాలో టీడీపీతో పొత్తుని ప్రజలు స్వాగతించడం లేదని ఎంపీ అన్నారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ అంటే పడదని, అటువంటిది జనసేన బీజేపీతో దాగుడు మూతలు ఆడుతోందన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ కు మద్దతివ్వడం అనే అంశంపై ఒక విలేకరి ప్రశ్నించగా.. ఆ పార్టీతో, ఆమెతోనూ వైసీపీకి ఏ విధమైన సంబంధం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగతమని, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. వైఎస్సార్ టీపీకి తమకూ ఎటువంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!