MP Bharat Ram: ఆ రెండు పార్టీలకు సిగ్గుందా?.. రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాణాసంచా విక్రయ బజారు ప్రారంభోత్సవానికి వచ్చిన భరత్ మీడియాతో మాట్లాడారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పోటీ నుంచి చంద్రబాబు తప్పుకున్నారని అన్నారు. అంటే పవన్ బీజేపీకి, చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Read Also: MLA Shankar Rao: నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఈ జనసేన, టీడీపీ చేతులు కలిపి ఎన్నికలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని ఎంపీ భరత్ అన్నారు. ఇదెక్కడి రాజకీయాలో, ఇవేమి తెలివితేటలో.. ఈ రెండు పార్టీల వ్యవహార తీరు చూసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలూ అసహ్యించుకుంటున్నారని తెలిపారు. విలువలకు తిలోదకాలిచ్చి కేవలం అధికార దాహంతో ఈ విధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ ఎప్పుడూ మద్దతివ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎంపీ భరత్ తెలిపారు. అంశాల వారీగా అదీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బీజేపీతో సఖ్యతగా ఉంటున్నామని..స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి పనులు, నిధులు సాధించుకోవడంలో సఫలీకృతం అయ్యామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read Also: Pithani Satyanarayana: జగన్ పై ప్రజలకు నమ్మకం లేదు.. అందుకే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు
జనసేన బీజేపీతో పొత్తు, ఆంధ్రాలో టీడీపీతో పొత్తుని ప్రజలు స్వాగతించడం లేదని ఎంపీ అన్నారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ అంటే పడదని, అటువంటిది జనసేన బీజేపీతో దాగుడు మూతలు ఆడుతోందన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ కు మద్దతివ్వడం అనే అంశంపై ఒక విలేకరి ప్రశ్నించగా.. ఆ పార్టీతో, ఆమెతోనూ వైసీపీకి ఏ విధమైన సంబంధం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగతమని, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. వైఎస్సార్ టీపీకి తమకూ ఎటువంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!