Weather Updates : నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇది ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కూడా అలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Ram Pothineni: మూడు జనరేషన్లను మాయ చేసిన హీరో బాలయ్యే..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటిదేమీ జరగకపోయినా… తూర్పు ఆసియా, ఆగ్నేయ దేశాల నుంచి వస్తున్న మేఘాలు… బంగాళాఖాతంలో కురుస్తూ… అల్పపీడనంలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, జనగాం, సిద్దిపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read : Chandrayaan-3: మూడింట రెండు లక్ష్యాలు సాధించాం.. చంద్రయాన్-3 మిషన్పై ఇస్రో
ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణం మారిపోయింది. చిన్నపాటి వర్షం కురుస్తోంది. కానీ.. ఫలానా ప్రాంతంలో కాదు.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మేఘాలు.. అక్కడక్కడ ఘాటుగా.. కొన్ని చోట్ల సన్నగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న చోట మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు ఎండలు బాగానే ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అక్కడ వర్షం పడదు. ఈ నాలుగు రోజుల్లో వర్షాలు బాగా పడితే మంచిది. సెప్టెంబరు నుండి ఎక్కువ వర్షాలు పడవు.
దేశంలోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న చలి గాలులు..కొన్ని మేఘాలను కమ్ముకుంటూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు లడఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రాష్ట్రాలపై అనేక పొరల మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది. బీహార్, అస్సాం, మేఘాలయ, సిక్కింలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. అక్కడ తీవ్ర మేఘాలు కమ్ముకున్నాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మంచిది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!