Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వందే భారత్తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్ ఛార్జీలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. రైళ్లలో సీట్లు నింపడం ఆధారంగా ఈ ఛార్జీల తగ్గింపు ఉంటుందని రైల్వే తెలిపింది. ఛార్జీలు కూడా పోటీ రవాణా పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. వసతి సౌకర్యాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ఉద్దేశ్యంతో, రైళ్లలో ఏసీ సీటింగ్తో కూడిన రాయితీ ఛార్జీల పథకాలను ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న రైళ్లకు రాయితీలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని రైల్వే బోర్డు రైల్వేలోని వివిధ జోన్లను కోరింది.
Also Read: Man Eats Wifes Brain: భార్య మెదడును తిన్న మెక్సికన్ వ్యక్తి.. పుర్రెను యాష్ట్రేగా..
Also Read
ఏసీ సిట్టింగ్ అకామోడేషన్ కలిగిన అన్ని ట్రైన్స్లో టికెట్ ధరలపై తగ్గింపు ఉంటుందని భారత రైల్వే శాఖ పేర్కొంది. బేసిక్ ఛార్జీపై గరిష్టంగా 25 శాతం తగ్గింపు ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇది కాకుండా రిజర్వేషన్ రుసుము, సూపర్ ఫాస్ట్ సర్చార్జ్, జీఎస్టి వంటివి, మొదలైన ఇతర ఛార్జీలు అలానే విధించబడతాయి. వీటిని అదనంగానే చెల్లించుకోవాలి. ఆక్యుపెన్సీ ఆధారంగా డిస్కౌంట్ రేటులో మార్పు ఉంటుందని తెలిపింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సడలింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాంటి రీఫండ్ అంటూ ఏమీ ఉండదు. ఒక నిర్దిష్ట తరగతిలో ఫ్లెక్సీ ఛార్జీలు వర్తించే రైళ్ల విషయంలో, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నట్లయితే, ఆక్యుపెన్సీని పెంచే చర్యగా ఈ పథకాన్ని మొదట ఉపసంహరించుకోవచ్చు. సెలవులు లేదా పండుగ ప్రత్యేకతలుగా ప్రారంభించబడిన ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు.
Also Read: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
ఏడాది కాలం వరకు ఈ డిస్కౌంట్ పథకం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ టికెట్ ధరల డిస్కౌంట్ పథకం అనేది కేవలం ఎంపిక చేసిన ఏసీ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ స్లీపర్, జరనల్ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ ఉండదు. అంటే ఎలాంటి డిస్కౌంట్ పొందలేరు. అందు వల్ల రైల్వే తాజా నిర్ణయంతోనే కొందరికే వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!