Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వందే భారత్తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్ ఛార్జీలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. రైళ్లలో సీట్లు నింపడం ఆధారంగా ఈ ఛార్జీల తగ్గింపు ఉంటుందని రైల్వే తెలిపింది. ఛార్జీలు కూడా పోటీ రవాణా పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. వసతి సౌకర్యాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ఉద్దేశ్యంతో, రైళ్లలో ఏసీ సీటింగ్తో కూడిన రాయితీ ఛార్జీల పథకాలను ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న రైళ్లకు రాయితీలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని రైల్వే బోర్డు రైల్వేలోని వివిధ జోన్లను కోరింది.
Also Read: Man Eats Wifes Brain: భార్య మెదడును తిన్న మెక్సికన్ వ్యక్తి.. పుర్రెను యాష్ట్రేగా..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఏసీ సిట్టింగ్ అకామోడేషన్ కలిగిన అన్ని ట్రైన్స్లో టికెట్ ధరలపై తగ్గింపు ఉంటుందని భారత రైల్వే శాఖ పేర్కొంది. బేసిక్ ఛార్జీపై గరిష్టంగా 25 శాతం తగ్గింపు ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇది కాకుండా రిజర్వేషన్ రుసుము, సూపర్ ఫాస్ట్ సర్చార్జ్, జీఎస్టి వంటివి, మొదలైన ఇతర ఛార్జీలు అలానే విధించబడతాయి. వీటిని అదనంగానే చెల్లించుకోవాలి. ఆక్యుపెన్సీ ఆధారంగా డిస్కౌంట్ రేటులో మార్పు ఉంటుందని తెలిపింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సడలింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాంటి రీఫండ్ అంటూ ఏమీ ఉండదు. ఒక నిర్దిష్ట తరగతిలో ఫ్లెక్సీ ఛార్జీలు వర్తించే రైళ్ల విషయంలో, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నట్లయితే, ఆక్యుపెన్సీని పెంచే చర్యగా ఈ పథకాన్ని మొదట ఉపసంహరించుకోవచ్చు. సెలవులు లేదా పండుగ ప్రత్యేకతలుగా ప్రారంభించబడిన ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు.
Also Read: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
ఏడాది కాలం వరకు ఈ డిస్కౌంట్ పథకం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ టికెట్ ధరల డిస్కౌంట్ పథకం అనేది కేవలం ఎంపిక చేసిన ఏసీ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ స్లీపర్, జరనల్ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ ఉండదు. అంటే ఎలాంటి డిస్కౌంట్ పొందలేరు. అందు వల్ల రైల్వే తాజా నిర్ణయంతోనే కొందరికే వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!