Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వందే భారత్తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్ ఛార్జీలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. రైళ్లలో సీట్లు నింపడం ఆధారంగా ఈ ఛార్జీల తగ్గింపు ఉంటుందని రైల్వే తెలిపింది. ఛార్జీలు కూడా పోటీ రవాణా పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. వసతి సౌకర్యాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ఉద్దేశ్యంతో, రైళ్లలో ఏసీ సీటింగ్తో కూడిన రాయితీ ఛార్జీల పథకాలను ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న రైళ్లకు రాయితీలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని రైల్వే బోర్డు రైల్వేలోని వివిధ జోన్లను కోరింది.
Also Read: Man Eats Wifes Brain: భార్య మెదడును తిన్న మెక్సికన్ వ్యక్తి.. పుర్రెను యాష్ట్రేగా..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఏసీ సిట్టింగ్ అకామోడేషన్ కలిగిన అన్ని ట్రైన్స్లో టికెట్ ధరలపై తగ్గింపు ఉంటుందని భారత రైల్వే శాఖ పేర్కొంది. బేసిక్ ఛార్జీపై గరిష్టంగా 25 శాతం తగ్గింపు ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇది కాకుండా రిజర్వేషన్ రుసుము, సూపర్ ఫాస్ట్ సర్చార్జ్, జీఎస్టి వంటివి, మొదలైన ఇతర ఛార్జీలు అలానే విధించబడతాయి. వీటిని అదనంగానే చెల్లించుకోవాలి. ఆక్యుపెన్సీ ఆధారంగా డిస్కౌంట్ రేటులో మార్పు ఉంటుందని తెలిపింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సడలింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాంటి రీఫండ్ అంటూ ఏమీ ఉండదు. ఒక నిర్దిష్ట తరగతిలో ఫ్లెక్సీ ఛార్జీలు వర్తించే రైళ్ల విషయంలో, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నట్లయితే, ఆక్యుపెన్సీని పెంచే చర్యగా ఈ పథకాన్ని మొదట ఉపసంహరించుకోవచ్చు. సెలవులు లేదా పండుగ ప్రత్యేకతలుగా ప్రారంభించబడిన ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు.
Also Read: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
ఏడాది కాలం వరకు ఈ డిస్కౌంట్ పథకం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ టికెట్ ధరల డిస్కౌంట్ పథకం అనేది కేవలం ఎంపిక చేసిన ఏసీ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ స్లీపర్, జరనల్ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ ఉండదు. అంటే ఎలాంటి డిస్కౌంట్ పొందలేరు. అందు వల్ల రైల్వే తాజా నిర్ణయంతోనే కొందరికే వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!