Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. శనివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు మొఘల్ రోడ్డులో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటితో పాటు భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.
Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి, మొఘల్ రోడ్ మరియు శ్రీనగర్-సోన్మార్గ్-గుమ్రీ రోడ్తో సహా ప్రధాన రహదారులపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఈ మార్గాలన్నీ మూసివేసినట్లు తెలిపారు. రోడ్లపై రాళ్లు, చెత్తాచెదారం ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు రోడ్లపై ఉన్న చెత్తను తొలగించే వరకు ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించవద్దని అధికారులు కోరారు.
West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!
రాంబన్లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని రాంబన్ ఎస్ఎస్పి మోహిత శర్మ తెలిపారు. కొండచరియలు విరిగిపడటం మరియు రాక్ పడిపోవడంతో.. వాటిని తొలగించే వరకు రహదారిని మూసివేశారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు ముందుగా ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) సలహా తీసుకోవాలని ఎస్ఎస్పీ శర్మ తెలిపారు. NH-44, మొఘల్ రోడ్ మరియు SSG రోడ్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. బనిహాల్ మరియు ఖాజీగుండ్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసును కూడా రోజంతా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు.
Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్
భారీ వర్షం కురుస్తుండటంతో రెండోరోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను పహల్గాం, బల్తాల్ మార్గాల్లో ప్రయాణాన్ని ఆపేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణీకులను ముందుకు వెళ్లనివ్వడం లేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!