Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్లో పోటీ చేయగా.. అమేథీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. వయనాడ్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం దిశగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, 2019 లోక్సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని దాదాపు 55,000 ఓట్ల తేడాతో ఓడించారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్ ప్రయాణంలో కీలక ఘట్టం.. ల్యాండింగ్కు అడుగు దూరంలో..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అమేథీ లోక్సభ నియోజకవర్గం ఒకప్పుడు గాంధీ కుటుంబం జేబులో ఉండేది. రాహుల్ గాంధీ 2004 నుంచి అక్కడి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ రాహుల్ కోసం సీటును ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కృషి చేస్తారని అజయ్ రాయ్ సూచించారు. 2019 లోక్సభ ఎన్నికలలో కూడా, ప్రధాని మోడీని సవాలు చేస్తూ ప్రియాంక గాంధీ వారణాసి నుండి పోటీ చేయవచ్చని ఊహించబడింది. అయితే కాంగ్రెస్ చివరి క్షణంలో అజయ్ రాయ్ను ఆ సీటు నుంచి పోటీకి దింపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ వారణాసి నుంచి పోటీ చేసి నరేంద్ర మోదీ చేతిలో ఓడిపోయారు.
మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువునష్టం కేసులో తన పదవిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ఇటీవల సుప్రీం తీర్పుతో మళ్లీ ఎంపీగా తన పదవిని దక్కించుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలోనూ రాహుల్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా.. మరో సారి భారత్ జోడో యాత్ర చేపట్టి దేశ ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..