Rahul Gandhi: వైఎస్సార్ చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని.. వాళ్ళిద్దరిది రాజకీయ సంబంధమే కాదు అన్నాతమ్ములు లాగా కలిసిమెలిసి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కడపలో రాహుల్ ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి మార్గదర్శకులుగా ఉండేవారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తన జోడో యాత్రకు ప్రేరణ అని ఆయన వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి దేశవ్యాప్తంగా మీరు పాదయాత్ర చేయాలని తనతో చెప్పాడని రాహుల్ పేర్కొన్నారు.ఎప్పుడైతే మనం పాదయాత్ర చేస్తామో అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని వైఎస్సార్ చెప్పారన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రేమ విద్వేషపు ప్రాంతాల్లో ప్రేమను వికసింపజేశానన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదన్నారు. మార్పుతో కూడిన రాజకీయం నేడు నడుస్తోందన్నారు.
Read Also: Arvind Kejriwal: తొందరలోనే మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ జైలుకు పోతారు..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఈరోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీకి బీ టీం నడిపిస్తుందని.. బీ టీం అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేతిలో సీబీఐ ,ఈడీ ఉంది కాబట్టే వీళ్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. బీజేపీకి, రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందన్నారు. జగన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఎందుకంటే చాలా అవినీతి కేసులు జగన్పై ఉన్నాయన్నారు. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడుకు కూడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్లోని పౌరులకు ఒక వాగ్దానం చేసిందని.. ఏపీ విభజన సమయంలో ప్రజలకు వాగ్దానం చేసిందని.. మీకు ప్రత్యేక హోదా లభించిందా అంటూ రాహుల్ ప్రశ్నించారు. మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మీకు కడప స్టీల్ ప్లాంట్ లభించిందా అని అడిగారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం..
రాహుల్ మాట్లాడుతూ..”ఏదైతే ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తలవంచుకొని ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.అధికారం లోకి కేంద్ర ప్రభుత్వంరాగానే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి తీరుతాం. రెండున్నర లక్ష ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఐదు లక్షలతో నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాం. మా ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసి తీరుతాం. ఏడాదికి ఒక మహిళ అకౌంట్కు లక్ష రూపాయలు జమ చేస్తాం.నరేంద్ర మోడీ 25 మందిని మాత్రమే కోటీశ్వరులు చేశాడు. మేము కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాం. దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రక్తాన్ని చిందించి కష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని తొలగించి తన మనసులో ఏది వస్తే అది అమలు చేయాలి అనుకుంటున్నాడు.భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.” అని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!