Rahul Gandhi: “30 నిమిషాల్లోనే పాకిస్థాన్కి లొంగిపోయారు”.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.. పహల్గాం ఉగ్రదాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించారు.. భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపారని గుర్తు చేశారు.. పహల్గాం బాధితులను తాను స్వయంగా కలిశానని తెలిపారు.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయన్నారు.. ఆపరేషన్ సిందూర్కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.. పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్థాన్ పనే అని నొక్కి చెప్పారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షం భారత ప్రభుత్వం, బలగాలు మద్దతు ఇచ్చిందని.. కానీ ప్రభుత్వం సైన్యం చేతులు కట్టి ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు. ‘సింహాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి’ అని సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని తాము పాకిస్థాన్కు మధ్యాహ్నం 1.35 గంటలకు చెప్పామని రక్షణ మంత్రి సభలో చెప్పారని గుర్తు చేశారు. కేవలం 30 నిమిషాల్లో పాకిస్థాన్కు లొంగిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి పోరాడాలనే సంకల్పం లేదని ఇది స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ల చేతులు, కాళ్ళు కట్టివేసిందని ఆరోపించారు.
READ MORE: Film Chamber : ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదుల గొడవ..
“ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసిపోయింది.. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో సీజ్ ఫైర్ ప్రస్తావన వచ్చింది.. మోడీ ప్రభుత్వం సీజ్ ఫైర్పై పాకిస్థాన్కు సమాచారం ఇచ్చింది.. ఎయిర్ స్ట్రైక్కు ముందే పాకిస్థాన్కు మోడీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్థాన్ను అడిగింది.. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు పూర్తిగా లొంగిపోయింది.. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసింది. భారత ప్రభుత్వం తప్పు చేసింది. తప్పు సైన్యానిది కాదు. ప్రభుత్వానిది. యుద్ధం తానే ఆపినట్లు ట్రంప్ 29 సార్లు చెప్పారు. ప్రధానికి మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఈ సభలో చెప్పాలి. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం అయినా ఉంటే.. మోడీ ఈ విషయంపై మాట్లాడుతారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే, డోనాల్డ్ ట్రంప్ ను తప్పుబడతారు.” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?