Rahul Gandhi: “30 నిమిషాల్లోనే పాకిస్థాన్కి లొంగిపోయారు”.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.. పహల్గాం ఉగ్రదాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించారు.. భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపారని గుర్తు చేశారు.. పహల్గాం బాధితులను తాను స్వయంగా కలిశానని తెలిపారు.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయన్నారు.. ఆపరేషన్ సిందూర్కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.. పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్థాన్ పనే అని నొక్కి చెప్పారు.
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షం భారత ప్రభుత్వం, బలగాలు మద్దతు ఇచ్చిందని.. కానీ ప్రభుత్వం సైన్యం చేతులు కట్టి ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు. ‘సింహాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి’ అని సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని తాము పాకిస్థాన్కు మధ్యాహ్నం 1.35 గంటలకు చెప్పామని రక్షణ మంత్రి సభలో చెప్పారని గుర్తు చేశారు. కేవలం 30 నిమిషాల్లో పాకిస్థాన్కు లొంగిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి పోరాడాలనే సంకల్పం లేదని ఇది స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ల చేతులు, కాళ్ళు కట్టివేసిందని ఆరోపించారు.
READ MORE: Film Chamber : ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదుల గొడవ..
“ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసిపోయింది.. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో సీజ్ ఫైర్ ప్రస్తావన వచ్చింది.. మోడీ ప్రభుత్వం సీజ్ ఫైర్పై పాకిస్థాన్కు సమాచారం ఇచ్చింది.. ఎయిర్ స్ట్రైక్కు ముందే పాకిస్థాన్కు మోడీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్థాన్ను అడిగింది.. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు పూర్తిగా లొంగిపోయింది.. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసింది. భారత ప్రభుత్వం తప్పు చేసింది. తప్పు సైన్యానిది కాదు. ప్రభుత్వానిది. యుద్ధం తానే ఆపినట్లు ట్రంప్ 29 సార్లు చెప్పారు. ప్రధానికి మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఈ సభలో చెప్పాలి. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం అయినా ఉంటే.. మోడీ ఈ విషయంపై మాట్లాడుతారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే, డోనాల్డ్ ట్రంప్ ను తప్పుబడతారు.” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!