Rahul Gandhi: “30 నిమిషాల్లోనే పాకిస్థాన్కి లొంగిపోయారు”.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.. పహల్గాం ఉగ్రదాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించారు.. భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపారని గుర్తు చేశారు.. పహల్గాం బాధితులను తాను స్వయంగా కలిశానని తెలిపారు.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయన్నారు.. ఆపరేషన్ సిందూర్కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.. పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్థాన్ పనే అని నొక్కి చెప్పారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షం భారత ప్రభుత్వం, బలగాలు మద్దతు ఇచ్చిందని.. కానీ ప్రభుత్వం సైన్యం చేతులు కట్టి ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు. ‘సింహాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి’ అని సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని తాము పాకిస్థాన్కు మధ్యాహ్నం 1.35 గంటలకు చెప్పామని రక్షణ మంత్రి సభలో చెప్పారని గుర్తు చేశారు. కేవలం 30 నిమిషాల్లో పాకిస్థాన్కు లొంగిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి పోరాడాలనే సంకల్పం లేదని ఇది స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ల చేతులు, కాళ్ళు కట్టివేసిందని ఆరోపించారు.
READ MORE: Film Chamber : ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదుల గొడవ..
“ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసిపోయింది.. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో సీజ్ ఫైర్ ప్రస్తావన వచ్చింది.. మోడీ ప్రభుత్వం సీజ్ ఫైర్పై పాకిస్థాన్కు సమాచారం ఇచ్చింది.. ఎయిర్ స్ట్రైక్కు ముందే పాకిస్థాన్కు మోడీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్థాన్ను అడిగింది.. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు పూర్తిగా లొంగిపోయింది.. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసింది. భారత ప్రభుత్వం తప్పు చేసింది. తప్పు సైన్యానిది కాదు. ప్రభుత్వానిది. యుద్ధం తానే ఆపినట్లు ట్రంప్ 29 సార్లు చెప్పారు. ప్రధానికి మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఈ సభలో చెప్పాలి. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం అయినా ఉంటే.. మోడీ ఈ విషయంపై మాట్లాడుతారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే, డోనాల్డ్ ట్రంప్ ను తప్పుబడతారు.” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!