Rahul Gandhi : ఇది దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య జరిగే ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, లాభ నష్టాలు పక్కన పెట్టి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారని, దళితులకు భూములు ఇస్తా అన్నారు..మోసం చేశారన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ఎంత మందికి భూమి వచ్చింది ..? అందరికి ఉద్యోగాలు అన్నారు.. ఇచ్చాడా..? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్లు దొంగిలించారు. డబుల్ బెడ్ రూమ్ ఎంత వరకు వచ్చాయి. లక్ష రుణమాఫీ రైతులకు ఇచ్చాడా ..? కర్ణాటక.. చత్తీస్ ఘడ్ .. రాజస్థాన్ లో ఇచ్చిన హామీలు ఆమలు చేశాం. రాజస్థాన్ లో ఉచిత వైద్యం ఇస్తామని..25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తుంది రాజస్థాన్. రాజస్థాన్ లో వరికి మద్దతు ధర ఎక్కువ ఇస్తున్నాం. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీ లు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కావాలంటే వెళ్లి చూడండి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పోడు భూములు మీ హక్కు.. పోడు భూములు మీవి..మీకు ఇస్తాం.. అసైన్డ్ భూములు మీవి మీకు ఇస్తాం.. అడవి భూములు హక్కు లు ఇచ్చింది కాంగ్రెస్.. సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ ఉత్సవాలు గా చేస్తాం.. కుంభమేళా తరహాలో సమ్మక్క సారలమ్మ గిరిజన ఉత్సవాలు జాతీయ స్థాయిలో గుర్తిస్తాం..
Also Read
- Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
బీజేపీ తెలంగాణ లో ఒడిపోయింది.. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటుంది.. ఎంఐఎం కూడా వీళ్లిద్దరి తో కలిసి ఉంది. బీజేపీ ఏం కోరితే.. పార్లమెంట్ లో రైతు చట్టాలకు మద్దతు పలికింది బీఆర్ఎస్. జీఎస్టీకి మద్దతు ఇచ్చింది. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ ని ఓడించడం కోసం బీజేపీ..బీఆర్ఎస్.. ఎంఐఎం ఒక్కటి అయ్యాయి. కేసీఆర్ మీద ed కేసు లేదు..సీబీఐ కేసు లేదు. కనీసం ఐటీ నోటీసు కూడా లేదు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టింది మోడీ. నాపై కేసులు పెట్టారు.. ఎంపీ సీటు లేకుండా చేయాలని చూశారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే..బీజేపీ ఓటు వేసినట్టే. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్కి మద్దతు పలకండి.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!