Rahul Gandhi : ఇది దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య జరిగే ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, లాభ నష్టాలు పక్కన పెట్టి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారని, దళితులకు భూములు ఇస్తా అన్నారు..మోసం చేశారన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ఎంత మందికి భూమి వచ్చింది ..? అందరికి ఉద్యోగాలు అన్నారు.. ఇచ్చాడా..? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్లు దొంగిలించారు. డబుల్ బెడ్ రూమ్ ఎంత వరకు వచ్చాయి. లక్ష రుణమాఫీ రైతులకు ఇచ్చాడా ..? కర్ణాటక.. చత్తీస్ ఘడ్ .. రాజస్థాన్ లో ఇచ్చిన హామీలు ఆమలు చేశాం. రాజస్థాన్ లో ఉచిత వైద్యం ఇస్తామని..25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తుంది రాజస్థాన్. రాజస్థాన్ లో వరికి మద్దతు ధర ఎక్కువ ఇస్తున్నాం. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీ లు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కావాలంటే వెళ్లి చూడండి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పోడు భూములు మీ హక్కు.. పోడు భూములు మీవి..మీకు ఇస్తాం.. అసైన్డ్ భూములు మీవి మీకు ఇస్తాం.. అడవి భూములు హక్కు లు ఇచ్చింది కాంగ్రెస్.. సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ ఉత్సవాలు గా చేస్తాం.. కుంభమేళా తరహాలో సమ్మక్క సారలమ్మ గిరిజన ఉత్సవాలు జాతీయ స్థాయిలో గుర్తిస్తాం..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
బీజేపీ తెలంగాణ లో ఒడిపోయింది.. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటుంది.. ఎంఐఎం కూడా వీళ్లిద్దరి తో కలిసి ఉంది. బీజేపీ ఏం కోరితే.. పార్లమెంట్ లో రైతు చట్టాలకు మద్దతు పలికింది బీఆర్ఎస్. జీఎస్టీకి మద్దతు ఇచ్చింది. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ ని ఓడించడం కోసం బీజేపీ..బీఆర్ఎస్.. ఎంఐఎం ఒక్కటి అయ్యాయి. కేసీఆర్ మీద ed కేసు లేదు..సీబీఐ కేసు లేదు. కనీసం ఐటీ నోటీసు కూడా లేదు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టింది మోడీ. నాపై కేసులు పెట్టారు.. ఎంపీ సీటు లేకుండా చేయాలని చూశారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే..బీజేపీ ఓటు వేసినట్టే. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్కి మద్దతు పలకండి.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?