Rahul Gandhi: దేశ ప్రజలకు ఏం కావాలో ప్రధానికి అర్థం కావడం లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ‘ అగ్నిపథ్’ స్కీమ్ ప్రకంపనలు రేపుతోంది. ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్ లోని పలు జిల్లాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. టైర్లను కాలుస్తూ రైల్వే ట్రాక్స్ పై పడేస్తున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. అగ్ని పథ్ స్కీమ్ వల్ల యువతకు అగ్నిపరీక్ష పెట్టారని విమర్శలు చేశారు. తాజాగా ఆయన మరోసారి ఈ స్కీమ్ ను ఉద్దేశిస్తూ ప్రధానిపై విమర్శలు చేశారు.‘‘ అగ్నిపథ్ స్కీమ్ ను యువత తిరస్కరించారు, వ్యవసాయ చట్టాను రైతులు తిరస్కరించారు, నోట్ల రద్దును ఆర్థికవేత్తలు తిరస్కరించారు, జీఎస్టీని వ్యాపారులు తిరస్కరించారు, దేశ ప్రజలకు ఏం కావాలో ప్రధానికి అర్థం కావడం లేదు కాబట్టే ఆయన స్నేహితుల గొంతు తప్ప మరేమీ విపించడం లేదు’’ అంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
అగ్నిపథ్ స్కీమ్ పై విమర్శలు రావడం, ఆందోళనలు చేయడంపై కేంద్ర దిద్దుబాటు చర్యలను తీసుకుంటోంది. అగ్నిపథ్ స్కీమ్ వయోపరిమితిని పెంచింది. ఇంతకు ముందు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయోపరిమితి ఉంటే తాజాగా దీన్ని 23కు పెంచింది. మంగళవారం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు ఈ స్కీమ్ ను ప్రారంభించారు. దేశంలో 45 వేల మందిని అగ్నిపథ్ స్కీమ్ కింద ఆర్మీలోని మూడు విభాగాల్లోకి తీసుకోనున్నారు. అయితే వీరిని 4 ఏళ్ల కాలానికి మాత్రమే ఆర్మీలో ఉంచనున్నారు. రిటర్మెంట్ సమయంలో రూ.11-12 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నారు. అయితే రెగ్యులర్ ఆర్మీ వాళ్లకు ఇచ్చే పెన్షన్ వంటి సదుపాయాలను కట్ చేశారు. దీంతోనే చాలా మంది యువత ఆందోళనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!