Bharat Jodo Yatra: ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం కంటే పైగా రాష్ట్రాలను రాహుల్ చుట్టేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
జోడో యాత్రలో భాగంగా ఏపీలో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 100 కిలోమీటర్ల మేరకు 4 రోజుల పాటు రాహల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్ర సాగుతుందని తెలుస్తోంది. రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. ముఖ్యంగా ఓబుళాపురం, ఆలూరు, ఆదోనీ, పెద్దతుంబళం, మాధవరం మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని సమాచారం అందుతోంది. రాహుల్ గాంధీ ఏపీలోని ఏయే ప్రాంతాలలో పర్యటిస్తారో గురువారం స్పష్టత రానుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది. ఆ పార్టీలోని ముఖ్య నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. దీంతో దాదాపుగా పార్టీ ఖాళీ అయ్యింది. అయితే ఇప్పుడు రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మొత్తానికి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు 3,571 కి.మీ. మేర 68 పార్లమెంట్ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమై కాశ్మీర్లో ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలంతా పాల్గొంటారని ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!