Suicide: భార్యభర్తల మధ్య గొడవలు.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య
- ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య
- తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్
- ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో ఘటన
- మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని హమీర్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
Ayurvedic Drink: ఈ ఆయుర్వేద పానీయంతో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు చెక్..
Also Read
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
వివరాల్లోకి వెళ్తే.. మోహిని అనే వివాహిత దాదాపు 10 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరు పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. అయితే.. మూడేళ్ల క్రితం వీరి మధ్య గొడవలు దూరాయి. ఈ క్రమంలో భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో.. ఆ మహిళ తన కన్నవారింటికి వచ్చి ఉంటుంది. కూలి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. అయితే.. ఆమె శనివారం నోయిడా వెళుతున్నానని చెప్పి తన ఇద్దరు కుమారులు 5 ఏళ్ల గౌతమ్, 3 ఏళ్ల హర్ష్తో కలిసి ముస్కరా పట్టణానికి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని ప్రాంతానికి చేరుకున్న వివాహిత మోహిని.. అక్కడ పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తానూ తాగింది. అయితే.. కొద్దిసేపటికే ముగ్గురి పరిస్థితి విషమించింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చేలోపే మోహిని, గౌతమ్ చనిపోయారు. చిన్న కుమారుడు హర్ష్ను సిహెచ్సికి తరలించారు. అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయగా.. తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పిల్లవాడు కూడా మరణించాడు.
Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
చనిపోయే ముందు మృతురాలు నోయిడాలో నివసిస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేసిం మాట్లాడింది. పిల్లలిద్దరితో పాటు తాను కూడా విషం సేవించినట్లు తన తల్లికి చెప్పాలని కోరింది. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు ముస్కారాకు చేరుకున్నారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీయ్యారు. మోహిని తల్లి రాజకుమారి మాట్లాడుతూ.. మోహిని 10 సంవత్సరాల క్రితం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పింది. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఇద్దరూ విడివిడిగా జీవించేవారని తెలిపింది. ఈ క్రమంలో.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తల్లి తెలిపింది.
- Tags
- children
- Crime News
- husband
- suicide
- wife
తాజావార్తలు
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్స్టాపబుల్’ రైటర్తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!