PV Narasimha Rao : సిడ్నీలో భారత మాజీ ప్రధాని విగ్రహం.. కేసీఆర్పై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిడ్నీలోని హోమ్బుష్ పార్క్లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో మంజూరు చేయబడి, స్థాపించబడిన ఈ విగ్రహాన్ని నరసింహారావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్యే వాణీదేవి సమక్షంలో స్ట్రాత్ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్మోర్ ఆవిష్కరించారు. ఈ కార్య్రమంలో టీఆర్ఎస్(BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్, స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యా రెడ్డి ఉన్నారు. అయితే.. నరసింహారావు జయంతి శతజయంతి వేడుకల్లో భాగంగా సిడ్నీలో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆస్ట్రేలియాలోని తెలుగువారు అన్నారు. భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా పీవీఎన్ఆర్ గొప్పతనం గురించే తెలిసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం కేసీఆర్ను ఆస్ట్రేలియాలోని తెలుగువారు అభినందిస్తున్నారు.
Also Read : Palvai Sravanthi : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని అర్ధం అయ్యింది
దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన నాయకుడిని కనీస గౌరవం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనప్పటికీ, పీవీఎన్ఆర్ వారసత్వం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కొనసాగేలా కేసీఆర్ చేశారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయ రంగంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని నాగేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సిడ్నీలో విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. నరసింహారావు గురించి ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకోవడానికి స్ట్రాత్ఫీల్డ్ టౌన్ హాల్లో సమావేశం కూడా నిర్వహించారు.
Also Read
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!