COVID-19: భారత్లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?
- పంజాబ్లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మృతి
- చండీగఢ్ సెక్టార్ 32లోని ప్రభుత్వం ఆస్పత్రిలో ఘటన
- కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్లు తెలిపిన వైద్యులు
- మృతుడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ నివాసిగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు చుట్టుముట్టడంతో అతని పరిస్థితి విషమించింది.
READ MORE: OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్
Also Read
ఆరోగ్యం నిరంతరం క్షీణించడం చూసి, వైద్యులు రోగికి COVID-19 పరీక్షలు చేయించారు. నివేదికలో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత రోగిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కానీ వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఏడాదిలో ఇదే తొలి కోవిడ్ మరణం అని చెబుతున్నారు. కాగా.. మృతుడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ నివాసి అని, కానీ అతను లూధియానాలో కూలీగా పనిచేసేవాడని చెబుతున్నారు.
READ MORE: Minister Gottipati Ravi: గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు..
కాగా.. దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు.
Tags:
తాజావార్తలు
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!