Son Attacked Parents: స్టాక్ మార్కెట్ లో లక్షల్లో లాస్.. డబ్బుకోసం తల్లిదండ్రులను దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Attacked Parents: స్టాక్ మార్కెట్లో రూ. 10 లక్షల నష్టాన్ని పూడ్చేందుకు తన తండ్రి తనకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో, కన్న కొడుకు కనిపెంచిన తల్లిదండ్రులను అతి కిరాతకంగా కత్తితో పొడిచి, సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం ఇంట్లో వున్న సొత్తును తీసుకెళ్లాడు. తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఢిల్లీలోని ఫతే నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది
టెంట్ హౌస్ వ్యాపారి అయిన స్వర్ణ్జీత్ సింగ్, అతని భార్య అజిందర్ కౌర్, ఓ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్నాడు. అదే ఇంట్లోని పై ఫ్లోర్ లో అతని కొడుకు జస్దీప్ తన భార్యతో కలిసి నివాసం వుంటున్నాడు. టెంట్ హౌస్ వ్యాపార యజమానికి ఇద్దరు వివాహిత కుమార్తెలు కూడా ఉన్నారు, వారు వేరే చోట నివసిస్తున్నారు. అయితే కొడుకు ఎక్కువగా స్టాక్ మార్కెట్ పై డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టేవాడని, అది సరైన పద్దతి కాదు టెంట్ హౌస్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని స్వర్ణ్జీత్, జస్దీప్తో నిరంతరం చెప్పావాడు. అయినా వినని జస్దీప్ స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఎక్కువగా పెట్టేవాడు అంతేకాకుండా దానికోసం తండ్రిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
Read also: Business Today: Today Business Highlights 08-10-22
కుమారుడి ప్రవర్తనతో విసిగిన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కొడుకు పథకం ప్రకారం వీరిద్దరిని హత్య చేసేందుకు ప్లాన్ వేసి శుక్రవారం ఉదయం 6 గంటలకు వారు తినే వాటిలో ఓ తిండిపదార్థంలో విషపదార్థాన్ని కలిపాడు. దీంతో వారిద్దరు ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. కొడుకు తనతో పాటు తెచ్చుకున్న సుత్తి, స్కూడ్రైవర్ లాంటి పదునైనా ఆయుధాలతో ఇద్దరి ముఖాలపై కిరాతకంగా దాడిచేశాడు. తల్లిదండ్రులపై దొంగలు దాడి చేసినట్లు కనిపించడానికి వస్తువులను తరలించాడు. అయినప్పటికీ.. తన తల్లి ఇంకా బతికే ఉందని అతను గ్రహించలేదు.జస్దీప్ చంపాడని ఉపయోగించిన కత్తి, సుత్తిని స్థానిక పార్కులో విసిరాడు.అయితే.. అక్కడే ఉన్న కౌన్సిలర్ ఇంటికి చేరుకుని, ఇంట్లో ఎవరో చొరబడ్డారని తన తల్లిదండ్రులను హతమార్చారని కట్టుకథలు చెప్పాడు.
దీంతో కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న వృద్ధులను చూసి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సన్నీ మీద అనుమానం కలిగింది.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. మొదట్లో బుకాయించిన సన్నీ ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితుడి ముఖంపై దాదాపు 37 గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జస్దీప్ భార్యను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిచారు.
Special (Success) Story of Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..