Son Attacked Parents: స్టాక్ మార్కెట్ లో లక్షల్లో లాస్.. డబ్బుకోసం తల్లిదండ్రులను దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Attacked Parents: స్టాక్ మార్కెట్లో రూ. 10 లక్షల నష్టాన్ని పూడ్చేందుకు తన తండ్రి తనకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో, కన్న కొడుకు కనిపెంచిన తల్లిదండ్రులను అతి కిరాతకంగా కత్తితో పొడిచి, సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం ఇంట్లో వున్న సొత్తును తీసుకెళ్లాడు. తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఢిల్లీలోని ఫతే నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది
టెంట్ హౌస్ వ్యాపారి అయిన స్వర్ణ్జీత్ సింగ్, అతని భార్య అజిందర్ కౌర్, ఓ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్నాడు. అదే ఇంట్లోని పై ఫ్లోర్ లో అతని కొడుకు జస్దీప్ తన భార్యతో కలిసి నివాసం వుంటున్నాడు. టెంట్ హౌస్ వ్యాపార యజమానికి ఇద్దరు వివాహిత కుమార్తెలు కూడా ఉన్నారు, వారు వేరే చోట నివసిస్తున్నారు. అయితే కొడుకు ఎక్కువగా స్టాక్ మార్కెట్ పై డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టేవాడని, అది సరైన పద్దతి కాదు టెంట్ హౌస్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని స్వర్ణ్జీత్, జస్దీప్తో నిరంతరం చెప్పావాడు. అయినా వినని జస్దీప్ స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఎక్కువగా పెట్టేవాడు అంతేకాకుండా దానికోసం తండ్రిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read also: Business Today: Today Business Highlights 08-10-22
కుమారుడి ప్రవర్తనతో విసిగిన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కొడుకు పథకం ప్రకారం వీరిద్దరిని హత్య చేసేందుకు ప్లాన్ వేసి శుక్రవారం ఉదయం 6 గంటలకు వారు తినే వాటిలో ఓ తిండిపదార్థంలో విషపదార్థాన్ని కలిపాడు. దీంతో వారిద్దరు ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. కొడుకు తనతో పాటు తెచ్చుకున్న సుత్తి, స్కూడ్రైవర్ లాంటి పదునైనా ఆయుధాలతో ఇద్దరి ముఖాలపై కిరాతకంగా దాడిచేశాడు. తల్లిదండ్రులపై దొంగలు దాడి చేసినట్లు కనిపించడానికి వస్తువులను తరలించాడు. అయినప్పటికీ.. తన తల్లి ఇంకా బతికే ఉందని అతను గ్రహించలేదు.జస్దీప్ చంపాడని ఉపయోగించిన కత్తి, సుత్తిని స్థానిక పార్కులో విసిరాడు.అయితే.. అక్కడే ఉన్న కౌన్సిలర్ ఇంటికి చేరుకుని, ఇంట్లో ఎవరో చొరబడ్డారని తన తల్లిదండ్రులను హతమార్చారని కట్టుకథలు చెప్పాడు.
దీంతో కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న వృద్ధులను చూసి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సన్నీ మీద అనుమానం కలిగింది.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. మొదట్లో బుకాయించిన సన్నీ ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితుడి ముఖంపై దాదాపు 37 గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జస్దీప్ భార్యను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిచారు.
Special (Success) Story of Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!