Bangladesh: ‘షేక్ హసీనాను ఉరితీయాల్సిందే’.. మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్
- షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినా ఆగని నిరసనలు
- తాజాగా మళ్లీ బంగ్లాలో నిరసనల సెగ
- దేశానికి తీసుకొచ్చి అవినీతిపై విచారించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు.. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా.. దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనాను భారతదేశం నుంచి తిరిగి బంగ్లాదేశ్ కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు. షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని.. అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని ఓ విద్యార్థి ఆరోపించారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి పంపాలని భారత ప్రధానిని కోరుకుంటున్నామన్నారు.
READ MORE:Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
కేవలం అవినీతిపైనే మా పోరాటం అని విద్యార్థి ఆందోళనకారులు చెబుతున్నారు. “మేము ఇంతకు ముందు కూడా హిందువులతో కలిసి జీవించాం. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం.” అని నిరసన కారులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస నేపథ్యంలో.. ఇటీవల మొహమ్మద్ యూనస్ హిందువుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మాజీ ప్రధాని పాలనపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముహమ్మద్ యూనస్ ఆదివారం మాట్లాడుతూ.. “షేక్ హసీనా పాలన క్రూరమైంది. నియంతృత్వాన్ని ఆమె అవలంబించింది. ఒకటిన్నర దశాబ్దాల పాలనలో దేశంలోని ప్రతి సంస్థను నాశనం చేసింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోంది.” అని పేర్కొన్నారు.
READ MORE: Vande bharat train: వందే భారత్ రైల్లో కలుషిత ఆహారం.. పప్పులో బొద్దింక ప్రత్యక్షం
కాగా.. బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పరారయ్యారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!